Prabhas: `బాహుబలి` సిరీస్తో నేషనల్ స్టార్గా ఎదిగిన ప్రభాస్.. ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా చిత్రాలే చేస్తున్నాడు. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు సైతం ప్రభాస్తో సినిమాలు చేసేందుకు వెంటబడుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ప్రభాస్ సినీ కెరీర్పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సరం ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే వేణు స్వామి టాలీవుడ్ హీరోల జాతకాలను తిరగేశారు. ఇందులో భాగంగానే ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయన నటించబోయే సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారబోతున్నాయి. నిర్మాతలు భారీగా నష్టపోతారని వేణు స్వామి పేర్కొన్నారు.
ప్రభాస్ తో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తే.. ఇక అంతే సంగతులు. కాబట్టి. ఆయనతో సినిమాలు నిర్మించాలనుకునే నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచించారు. దీంతో వేణు స్వామి కామెంట్స్ నెట్టింట వైరల్గా మారగా.. ఆయనపై ప్రభాస్ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే వేణు స్వామి ప్రభాస్ను టార్గెట్ చేశాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
కాగా, ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, ఓం రౌత్ తో `ఆదిపురుష్`, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో `ప్రాజెక్ట్-కె`, సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో ఆదిపురుష్ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది.