ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమాని కంప్లీట్ చేసి ఉన్నారు. ఈ సినిమాని గోపిచంద్ మలినేని తెరకెక్కించగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మీ శరత్ కుమార్, తమిళ దర్శకుడు సముద్రఖని నెగిటివ్ రోల్స్ లో నటించారు. ఇక ఈ సినిమా రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ ఫాం లోకి రావాలని కసిగా ఉన్నారు అటు దర్శకుడు ఇటు హీరో. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో నటిసాడని ఇప్పటికే అధికారకంగా ప్రకటన వచ్చింది.
ఇప్పుడు మరో సినిమాకి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పన్ కోషియమ్’ తెలుగులో గత కొన్ని రోజుల నుండి హాట్ టాపిక్ అవుతోంది. వాస్తవంగా ముందు ఈ సినిమాలో వెంకటేష్ నటిస్తాడన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికే ఒక సినిమా రీమేక్ లో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద ఆసక్తి చూపించలేదట. ఆ తర్వాత బాలకృష్ణ, రానా కలిసి నటించబోతున్నారని ఇటివలే వార్తలు వచ్చాయి. అయితే ఇందులో వస్తవం లేదని తేలిపోయింది.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ నటించేందుకు ముందుకు వచ్చాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో రీమేక్ చేయబోతోండగా అన్ని పరిస్థితులు చక్కబడి అనుకూలిస్తే ఈ సినిమా ఆగస్టు నుండి సెట్స్ మీదకి వచ్చే అవకాశం ఉందట. అంతేకాదు క్రాక్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించిన రవితేజ ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ లోను పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. గతంలో రవితేజ పోలీస్ గా నటించిన విక్రమార్కుడు, పవర్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఉన్న మరో హీరో పాత్ర ఎవరు చేస్తారన్నది ఇంకా క్లారిటి రాలేదు.