Keerthy Suresh: కీర్తి సురేష్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. చైల్ట్ ఆర్టిస్ట్గా కెరీర్ను స్టార్ట్ చేసిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో టాలీవుడ్లో మరిన్ని అవకాశాలను దక్కించుకున్న కీర్తి.. `మహానటి` మూవీతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.
అయితే గత కొద్ది రోజులగా ఈ బ్యూటీ వరుస అపజయాలతో సతమతం అవుతోంది. ఈమె నటించిన మిస్ ఇండియా, రంగ్దే, పెద్దన్న చిత్రాలు వరసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. తాజాగా వచ్చిన గుడ్ లక్ సఖి చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.
ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబుతో `సర్కారు వారి పాట` సినిమా చేస్తోంది. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కానుంది. అలాగే మరోవైపు చిరంజీవికి చెల్లెలుగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న `భోళా శంకర్`లోనూ నటిస్తోంది.
ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉండే కీర్తి సురేష్.. తాజాగా హాట్ డోస్ పెంచేసి మున్నెప్పుడూ చూపని అందాలను అందరికీ పరిచయం చేసింది. లైమ్ కలర్ లెహంగా చోళీ ధరించిన కీర్తి.. ఎద అందాలతో పాటు నడుమును కూడా ఎలివేట్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.
ఆపై అందుకు సంబంధించిన పిక్స్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మైండ్ బ్లాక్ చేస్తున్న కీర్తి లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. మొత్తానికి అందాల ఆరబోతలో కీర్తి సైతం తగ్గేదే లే అని నిరూపించుకుంది.