Trivikram Rana: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలతో త్రివిక్రమ్ ఎన్నో సినిమాలు చేసి అద్భుతమైన విజయాలు అందుకోవటం జరిగింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్.. మరి కొంతమంది కుర్ర హీరోలతో సినిమాలు చేశారు. ప్రస్తుతం మహేష్ బాబుతో “గుంటూరు కారం” అనే సినిమా చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఈ సినిమా కాకుండా పవన్ కళ్యాణ్ ఇటీవల నటిస్తున్న పలు సినిమాలకు స్క్రీన్ ప్లే తో పాటు డైలాగ్స్ అందిస్తూ ఉన్నారు. కాగా తాజాగా దగ్గుబాటి రానా.. నటించే కొత్త సినిమాకి త్రివిక్రమ్ స్టోరీ అందిస్తున్నారు. స్పిరిట్ మీడియా అనే నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. “హిరణ్య కశ్యప్” అనే టైటిల్ పెట్టడం జరిగింది. అమర్ చిత్ర కథ కామిక్స్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు రానా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అన్నది సస్పెన్స్ గా మారింది. ఇండస్ట్రీలో చాలా అరుదైన కాంబినేషన్ కావడంతో “హిరణ్య కశ్యప్” ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది.
నటుడిగా రానా చాలా వైవిధ్యమైన సినిమాలు చేస్తుంటారు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు భాషకి పరిమితం కాకుండా హిందీలో కూడా సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు కొత్తదనం కోరుకునే రానా ఫస్ట్ టైం టాప్ మోస్ట్ దర్శకుడు త్రివిక్రమ్ అందించబోయే స్టోరీ తో.. సినిమా చేయడానికి రెడీ కావడం సంచలనంగా మారింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మిగతా నటీనటులతో పాటు దర్శకుడు పేరు కూడా ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ “గుంటూరు కారం” సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఒకపక్క సినిమా చేస్తూనే మరోపక్క రానా కొత్త సినిమా స్టోరీ మొదలుపెట్టారట.