చిత్రపురి కాలనీలో ఇళ్లు దక్కని సినీ వర్కర్స్ కోసం మరికొంత స్థలాన్ని కేటాయించాలని జనసేనాని పవన్కల్యాణ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. దీని వల్ల 30 వేల మంది కార్మికులకు నివాసం కల్పించిన వారవుతారని ఆయన తెలిపారు. స్థల కేటాయింపు కోసం అవసరమైతే జనసేన పార్టీ తరపున వినతి పత్రాన్ని అందజేస్తామని ఆయన అన్నారు. హిందీ సినిమాకు ముంబై కేంద్రమైట్లు తెలుగు సినిమాకు హైదరాబాద్ కేంద్రం కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ కార్మికులు సమస్యలను తీర్చాలని ఆయన కోరారు. మంగళవారం తెలుగు సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ కార్యవర్గ సభ్యులతో బేటీ అయిన అనంతరం పవన్కల్యాణ్ మాట్లాడుతూ “సినీ పరిశ్రమ వల్ల కోట్లాది మందికి వినోదంతో పాటు ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ పరిశ్రమలోనూ సాధకబాధకాలున్నాయి. మద్రాసు నుండి హైదరాబాద్కి సినీ పరిశ్రమ వచ్చినప్పుడు 4 వేల మంది కార్మికుల కోసం అప్పటి ముఖ్యమంతి విజయభాస్కర్రెడ్డి 67.16 ఏకరాల భూమిని కేటాయించారు.ఇప్పుడు పరిశ్రమ చాలా పెద్దదైంది. ఇప్పుడు దాదాపు 35 వేల మంది కార్మికులున్నారు. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని మరి కొంత స్థలాన్ని కార్మికుల కో్సం కేటాయించాలి. అలాగే ప్రస్తుత చిత్రపురి ప్రాజెక్ట్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి“ అన్నారు.
previous post
next post