Allu Arjun: భారతీయ చలనచిత్ర రంగంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR, బాహుబలి 2 సినిమాలు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటాయి. ఈ రెండు సినిమాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని పెంచేసాయి. బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డులు ఇండియాలో ఇప్పటివరకు ఏ సినిమా బ్రేక్ చేయలేకపోయాయి. RRR అనేక అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడంతో పాటు ఆస్కార్ కూడా గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల రికార్డులను అల్లు అర్జున్ టార్గెట్ చేసినట్లు వార్త వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ “పుష్ప” సెకండ్ పార్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. పుష్ప మొదటి భాగం హిందీలో 100 కోట్లు కలెక్ట్ చేసింది. కనీసం ఒక్క ప్రమోషన్ కార్యక్రమం కూడా చేయకపోయినా ఆ స్థాయిలో బాలీవుడ్ లో రెస్పాన్స్ రావడంతో ఇప్పుడూ సెకండ్ పార్ట్ విషయంలో ప్రమోషన్స్ పై సినిమా యూనిట్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగింది. ఇదిలాఉండగా ఓ ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ సహాయంతో అన్ని ఓవర్సీస్ దేశాలలో.. “పుష్ప-2” సినిమాను సొంతంగా రిలీజ్ చేయాలని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.
హింది వెర్షన్ లో తెలుగు సినిమాలు చేసే బాక్స్ ఆఫీస్ వసూళ్లపై దృష్టి పెట్టారు మేకర్స్. ఎందుకంటే హిందీ మార్కెట్ పెద్దది. తెలుగు కంటే హిందీ వెర్షన్ లోనే భారీగా కలెక్షన్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. పుష్ప మొదటి భాగం కలెక్షన్స్ బట్టి సెకండ్ పార్ట్ విషయంలో హిందీ బెల్టులో అత్యధికమైన లాభాలు వస్తాయని నిర్మాతలు భావిస్తున్నారట. కాబట్టి ఓ ప్రముఖ హిందీ డిస్ట్రిబ్యూటర్ సహాయంతో…హింది వెర్షన్ అన్ని ఓవర్సీస్ దేశాలలో మైత్రి మేకర్స్ నిర్మాణ సంస్థలు రిలీజ్ చేయటానికి సిద్ధపడినట్లు టాక్. ఈ రకంగా విడుదల చేయడం వల్ల RRR, బాహుబలి 2 రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.