Pushpa 2: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో బన్నీ పలికిన డైలాగులు వేసిన స్టెప్పులు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాయి. ప్రాంతం భాషలతో సంబంధం లేకుండా దేశ విదేశాలలో “పుష్ప” మేనియా నడిచింది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేసింది. హిందీలో ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా గాని 100 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించి చాలామందిని ఆశ్చర్యపరిచింది.
ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ జాతీయ అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న ‘పుష్ప-2’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ బిగ్ అప్ డేట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో “పుష్ప-2” అప్ డేట్ ఇవ్వండన్న ఫ్యాన్స్ ప్రశ్నకు ‘బన్ని బర్త్ డే(APR-8)కి టీజర్ ఉంటుంది’ అని రిప్లై ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవ్వుతున్నారు. ఆగస్టు 15వ తారీకు ఈ సినిమా రిలీజ్ కాబోతోందని ఆల్రెడీ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. దీంతో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
“పుష్ప” మొదటి భాగం కంటే రెండో భాగం అత్యధికమైన భాషల్లో విడుదల చేయబోతున్నారట. మొదటి భాగం విడుదలైన సమయంలో కరోనా ఎఫెక్ట్ కారణంగా ఎక్కడా కూడా ప్రమోషన్స్ చేయటానికి వీలుపడలేదు. తెలుగులో కూడా అంతంత మాత్రంగానే ప్రమోషన్స్ జరిగాయి. కానీ రెండో భాగానికి ప్రమోషన్ కార్యక్రమాలకు కనీసం ఒక నెలరోజుల పాటు సమయం కేటాయించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా మొత్తం “పుష్ప” సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ పడితే ఇండియాలో “బాహుబలి” రికార్డులు “పుష్ప” సెకండ్ పార్ట్ బ్రేక్ చేయడం గ్యారేంటి అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.