రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ట్రిపుల్ ఆర్ సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తరువాత దర్శకధీరుడు చేస్తున్న ఈ సినిమా అనౌన్స్ నుంచే స్కై రేంజ్లో ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఈ షెడ్యూల్లో చరణ్, తారక్పై యాక్షన్ ఎసిసోడ్స్ చిత్రీకరించారని తెలుస్తోంది.. అయితే ఒక షెడ్యూల్ కంప్లీట్ అయినప్పటికి ఇందులో నటించే హీరోయిన్స్ , విలన్ ఎవరు అనేది ఇంకా రివీల్ చేయకపోవడంతో అందరినూ మరింత ఆసక్తి నెలకొంది.ఈ మూవీ పిరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతుందని టాక్ వినిపిస్తోంది.ఆ ఆట్మాస్పీయర్ని క్రియేట్ చేస్తు 150 కోట్ల రూపాయలతో హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో15 ఎకరాల విస్తీర్ణంలో భారీ సెట్ వేశారట. ఈ సెట్లోనే సగం సినిమా చిత్రీకరణ ఉంటుందని సమాచారం.
75 % సినిమా సెట్లోనే షూటింగ్ జరుపుకొబోతుందని తెలుస్తోంది. ఇక చరణ్ , తారక్ లుక్ని ఎక్కడా రివీల్ చేయకుండా ఉండానికి ఈ ఇద్దరి హీరోలకు అక్కడే ఓ ఇల్లు కట్టించేశాడట రాజమౌళి. వాళ్ళ పాత్రలకు సంబంధించిన కసరత్తుల కోసం కూడా రెండు గదులు కట్టించాడట. ఇక అదే సెట్లో తనూ కూడా ఇల్లుని, ఆఫీసుని కట్టించుకున్నాడట జక్కన్న. అ సెట్లోనే ఓ గది ఎడిటింగ్ కోసం, మరో గది కాస్ట్యూమ్స్ కోసం ఉపయోగించనున్నారట. మరికొన్ని గదులు సెట్కు సంబంధించిన పరికరాలు, ప్రోపర్టీస్ కోసం కేటాయించారని తెలుస్తోంది.. ఇదే లోకెషన్లో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతాయట.అందుకే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా అక్కడికే షిఫ్ట్ అయ్యాడని సమాచారం.
తాజాగా సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టాడు రాజామౌళి. ఈ షెడ్యూల్లో తారక్, చరణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడట. అయితే సినిమా సెట్స్ పై ఉండగానే శాటిలైట్ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీ పడుతున్నాయట. ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ తెలుగు, తమిళ, హిందీ బాషలోని శాటిలైట్ హక్కుల కోసం 150 కోట్లు ఆఫర్ చేసిందని సమాచారం. కానీ ఈ చిత్రనిర్మాత డి వివి దానయ్య మాత్రం అందుకు అంగీకరించకుండా హోల్డ్లో పెట్టాడని టాక్.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన కథ గురించి ఇప్పటికే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పునర్జన్మ నేపథ్యంలో సాగే కథ అని, ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని, తారక్ నెగిటివ్ పాత్రలో నటిస్తున్నాడంటు అందుకే ఈ చిత్రానికి రామ రావణ రాజ్యం అనే పేరు పరిశీలుస్తున్నారని రకారకాల వార్తలు టాలీవుడ్ సర్కీల్లో చక్కర్లు కొడుతున్నాయి.. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం, ఇద్దరు క్రేజీ హీరోలు ఒకే స్ర్కీన్ని షేరు చేసుకుంటున్నారు కాబట్టి ఈ మూవీపై అంచనాలు హై రెంజ్లోనే ఉన్నాయి. మరి భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.