Raashi khanna: `మద్రాస్ కెఫె` అనే సినిమాతో కెరీర్ను ప్రారంభించిన రాశి ఖన్నా.. మనం మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన `ఊహలు గుసగుసలాడే` సినిమాలో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ బ్యూటీ.. ఆపై సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే, వెంకీ మామ ఇలా పలు హిట్ చిత్రాలను ఖాతాలో వేసుకుని క్రేజీ హీరోయిన్గా మారిపోయింది.
ప్రస్తుతం ఓవైపు వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరోవైపు చేతిలో ఉన్న చిత్రాలను చకచకా కంప్లీట్ చేస్తున్న రాశి ఖన్నా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉంటూ తనదైన అందాలతో ఎప్పటికప్పుడు కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతుంటుంది. ఇక కెరీర్ మొదట్లో కాస్త బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల కాలంలో బక్కచిక్కి మంచి ఫిజిక్తో తన ఫాలోయింగ్ను పెంచుకుంటూ పోతోంది.
తాజాగా కూడా బ్లాక్ కలర్లో ఉన్న డిఫరెంట్ డ్రెస్ను ధరించిన రాశి ఖన్నా.. అందాలు అరబోస్తూ కిల్లింగ్ లుక్స్తో ఫొటోలకు పోజులిచ్చింది. అంతేకాదు, ఇంతకు సంబంధించిన పిక్స్ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దాంతో ఆమె అందాలు చూసి తట్టుకోలేకపోతున్న కుర్రాళ్ళు.. `అమ్మా తల్లి మమ్మల్ని వదిలేయ్.. నీ అందంతో చంపకు` అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి రాశి ఖన్నా హాట్ పిక్స్ మాత్రం నెట్టింట వైరల్గా మారాయి.
కాగా, ఈమె సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల `అంతఃపురం` మూవీతో అటు తమిళ్, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించిన రాశి ఖన్నా ప్రస్తుతం నాగ చైతన్యతో `థ్యాంక్యూ`, గోపిచంద్ జోడీగా `పక్కా కమర్షియల్` చిత్రాలు చేస్తోంది. అలాగే పలు హిందీ, తమిళ్ చిత్రాలకూ రాశి సైన్ చేసింది.