Mega 156: తెలుగు చలనచిత్ర రంగంలో సినిమాలు చేయటంలో కుర్ర హీరోల కంటే మెగాస్టార్ చిరంజీవి మంచి స్పీడ్ మీద ఉన్నారు. కరోనా తర్వాత చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు విడుదల చేయడం జరిగింది. వీటిలో రెండు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాదిలో సంక్రాంతి పండుగకు వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్న చిరంజీవి..తర్వాత “భోళా శంకర్” తో పరాజయాన్ని చవిచూడటం జరిగింది. ఈ క్రమంలో కొన్ని రోజులపాటు విదేశాలలో విశ్రాంతి తీసుకున్న చిరంజీవి మొన్నటిదాకా తమ్ముడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లిలో బిజీబిజీగా గడిపారు. కాగా తాజాగా ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చేయబోతున్న ఫాంటసీ నేపథ్యంలో చేయబోతున్న సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.
సోషియో ఫాంటసీ నేపథ్యంలో “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమా మాదిరిగా కథ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూడు లోకాల కాన్సెప్ట్ రీతిలో సినిమాలో హీరో ముల్లోకాలను జయించే వ్యక్తిగా చూపించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో 156 వసినిమాగా… షూటింగ్ జరుపుకోనుంది. దర్శకుడు వశిష్ట ఆల్రెడీ “బింబిసార” తో అద్భుతమైన విజయాన్ని అందుకోవటం జరిగింది. ఈ సినిమా కూడా ఫాంటసీ నేపథ్యంలో తీస్తున్నారు. దీంతో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో వశిష్ట చేయబోతున్న సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొత్తం సినిమాలో ఆరు పాటలు ఉంటాయని సమాచారం. ఈ ప్రాజెక్టుకి “విశ్వాంభర” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలో ఎక్కువగా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వర్క్ కి పెద్దపేట వేసినట్లు ఫిలిం నగర్ టాక్. వాస్తవానికి “భోళా శంకర్” తర్వాత “బ్రోడాడీ” అనే తమిళ సినిమాని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రీమేక్ చేయాలని చిరంజీవి అనుకున్నారు. అంతేకాదు ఈ సినిమాకి కూతురు సుస్మిత నిర్మాతగా కూడా ప్రకటించడం జరిగింది.
అయితే వరుస రీమేక్ లతో ఫలితాలు పరాజయాలు వస్తుండటంతో ప్రస్తుతానికి రీమేక్ ఆలోచన పక్కనపెట్టి తమిళ్ డైరెక్టర్ మిత్రన్ తో ఒరిజినల్ కథతో సుస్మిత ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాని మెగా 157గా చేయాలని ఫిక్స్ అయ్యారట. దీంతో వశిష్ట ప్రాజెక్టు.. ఉన్నఫలంగా సెట్స్ మీదకి రావటంతో మెగా156వ సినిమాగా… చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి. అయితే మధ్యలో చిరంజీవి మోకాలి సర్జరీ…వరుణ్ పెళ్లి నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ మారేడుమిల్లి అడవులలో.. స్టార్ట్ అయినట్లు డైరెక్టర్ వశిష్ట సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి చంద్రబోస్ సాహిత్యాన్ని అందిస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి, కీరవాణి, చోటా కాంబోలో సినిమా వస్తుండటంతో ఈ మెగా156 ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.