Mahesh Trivikram: “సర్కారు వారి పాట” సూపర్ డూపర్ హిట్ కావడంతో మహేష్ బాబు మంచి జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే. కరోనా లాక్డౌన్ సమయంలో దాదాపు రెండు సంవత్సరాలపాటు “సర్కారు వారి పాట” షూటింగ్ బ్రేకులు పడుతూ ఎట్టకేలకు కంప్లీట్ చేసుకుని గత నెల 12 వ తారీకు విడుదల అయ్యి.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం తెలిసిందే. కరోనా రాకముందు 3 బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఫామ్ లో ఉన్న మహేష్… “SVP” తో మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట సినిమా బ్లాక్ బస్టర్ కావటంతో ఫ్యామిలీతో కలిసి మహేష్ యూరప్ ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి కొన్ని డౌట్స్ ఇటీవల మహేష్ కి ఏర్పడినట్లు సమాచారం. దీంతో జర్మనీలో ఉన్న మహేష్ త్రివిక్రమ్ ని పిలిపించుకుని మరీ చేయబోయే ప్రాజెక్టు పై ఉన్న సందేహాలు తీర్చుకునే పనిలో పడ్డారట. వాస్తవానికి జూన్ నెలాఖరులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భావించారు.
కానీ స్క్రిప్టుపై కొన్ని సందేహాలు మహేష్ కి ఏర్పడటంతో.. సినిమా షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా… రెండూ కూడా ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో రాబోతున్న మూడో సినిమా పై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి.