Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో చెయ్యని రీతిలో వరుస సినిమాలను చిరు లైన్ లో పెడుతున్నారు. కరోనా తర్వాత అత్యధిక సినిమాలు తెలుగులో చేసినది చిరంజీవి. ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలతో… బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం జరిగింది. ఈ నాలుగింటిలో రెండు సూపర్ హిట్ అవ్వగా రెండు అట్టర్ ప్లాప్ అయ్యాయి. చాలావరకు కుర్ర దర్శకులతోనే చిరంజీవి సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి తన కెరియర్ లో 156వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమల్లిలో మొదటి షెడ్యూల్ ప్రారంభం కావడం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మేటర్ లోకి వెళ్తే దాదాపు 250 కోట్లకు పైగా ఈ సినిమా కోసం యువి క్రియేషన్స్ ఖర్చు పెడుతూ ఉందట. ఇంతగా బడ్జెట్ ఖర్చు వెనకాల ప్రధాన కారణం హై క్వాలిటీ విజువల్ గ్రాఫిక్స్ సన్నివేశాలు ఎక్కువ ఉండబోతున్నాయట. అది చాలా క్వాలిటీతో కూడిన టెక్నికల్ ఎలిమెంట్స్ తో చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. సో ఈ సినిమా చిరంజీవి కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ సినిమా అని.. అంటున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరక్కబోతున్న ఈ సినిమాకి.. “విశ్వంభరా” అనే టైటిల్ పెట్టే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అప్పట్లో దివంగత శ్రీదేవి హీరోయిన్ గా నటించిన “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమా తరహాలో ఈ సినిమా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. ముల్లోకాలతో పోరాడే వ్యక్తిగా చిరంజీవిని ఈ సినిమాలో డైరెక్టర్ వశిష్ట చూపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తిగా కూడా చిరంజీవి కనిపించబోతున్నారట. డైరెక్టర్ వశిష్ట… తన మొదటి సినిమా హీరో కళ్యాణ్ రామ్ తో “బింబిసారా” తో.. అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. “బింబిసారా” కూడా సోషియో ఫాంటసీ.. నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. ఆ సినిమా చూసి చిరంజీవి పిలిచి మరి వశిష్ఠాకి అవకాశం ఇచ్చినట్టు టాక్.