Virata Parvam: విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `విరాటపర్వం`. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్, జరీనా వాహెబ్ తదితరులు కీలక పాత్రలను పోషించగా.. సురేష్ బొబ్బిలి ఈ మూవీకి స్వరాలు అందించారు.
నక్సలిజం బ్యాక్డ్రాప్లో పొలిటికల్ పీరియాడిక్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ, విడుదలకు మాత్రం మోక్షం కలగడం లేదు. మొదట ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలనుకున్నా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక సురేష్ ప్రొడక్షన్స్ పై నిర్మితమైన దృశ్యం -2, నారప్ప చిత్రాలు ఓటీటీ వేదికగా విడుదలై మంచి విజయం సాధించాయి.
దీంతో విరాటపర్వం కూడా ఓటీటీలోనే వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. ప్రఖ్యాత స్ట్రీమింగ్ నెట్ వర్క్ నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ, ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక మొన్నీ మధ్య రానా భీమ్లా నాయక్ ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడుతూ.. `మరి కొద్ది రోజుల్లోనే ప్రివ్యూ చూడబోతున్నాను. ఓ మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి, అతి త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం` అని చెప్పుకొచ్చాడు.
అయితే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో `విరాటపర్వం` విడుదల కు థియేటర్స్ దొరక్కపోవచ్చు. పెద్ద సినిమాల హడావుడి తగ్గాలంటే కనీసం మూడు, నాలుగు నెలల సమయమైనా పట్టేలా కనిపిస్తుంది. మరి అప్పటి వరకు నిర్మాత సురేష్ బాబు వేచి ఉంటారా..? లేక ఓటీటీ వైపు మొగ్గు చూపుతారా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కాగా, రానా ప్రస్తుతం బాబాయ్ వెంకటేష్తో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. `రానా నాయుడు` టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది. మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ కలిసి రానా నాముడుని డైరెక్ట్ చేస్తున్నారు.