బుల్లితెర ప్రేక్షకులను మైమరిచేలా చేయడానికి అన్ని టీవీ చానల్స్ సిద్ధమయ్యాయి. దసరా పండుగ కానుకగా ప్రతి టీవీ ఛానల్ తమ స్టార్ ఆర్టిస్టులతో ఒక్క స్పెషల్ ఈవెంట్ చేశాయి. అటు ఈ టీవీ ఇటు జీతెలుగు మరోవైపు స్టార్ మా కూడా ఒకరితో ఒకరు పోరుకు సిద్ధం అయ్యారు. ముందు నుండి ఈ టీవీ వినోదం విషయంలో మిగతా వారిపై ఈ టీవీ కొద్దిగా పైచేయి సాధిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం జీ తెలుగు వారికి గట్టిపోటీని ఇవ్వాలని చూస్తోంది. మరోవైపు స్టార్ మా సీరియల్స్ ఆర్టిస్టులతో వీలైనంత హైప్ క్రియేట్ చేయాలని ఆశిస్తోంది.
ఈటీవీలో సుడిగాలి సుదీర్, నవదీప్, శేఖర్ మాస్టర్, రష్మీ, వర్షిని వంటివారు అక్క ఎవరే అతగాడు అనే స్పెషల్ ఈవెంట్ ప్రోమో వదులుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక యూత్ లో క్రేజ్ పెంచేందుకు అగ్గి పెట్టి మచ్చా గా సోషల్ మీడియాలో పేరొందిన కిరణ్ కుమార్ ను రంగంలోకి దించారు. అలాగే ఫ్యామిలీ లేడీస్ ను ఆకట్టుకునేందుకు సంగీత ను వర్షిని రష్మి పక్కన కూర్చోపెట్టారు. శేఖర్ మాస్టర్ సుధీర్ డాన్స్ స్టెప్పులు హైలైట్గా నిలవనున్నాయి.
జీ తెలుగు వారు ముఖ్యంగా శ్రీముఖి ప్రదీప్ పైన ఆధారపడి ఉన్నారు. వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు క్రియేట్ చేసేందుకు చేసిన వీడియోలు కూడా బాగానే ప్రాచుర్యం పొందాయి. వీరికి తోడుగా జానీ మాస్టర్ లేడీ గెటప్ వేసి చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ పై అందరికీ చాలా అంచనాలు ఉన్నాయి. స్టార్ మా వంటలక్క సీరియల్ పైన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆర్టిస్టులను తీసుకొని వచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఇక వీరిమధ్య పోరు పక్కన పెడితే ఇంట్లో రిమోట్ కోసం జరిగే పోరు మాత్రం గట్టిగా ఉండబోతుంది అని అర్థమవుతోంది.