Samantha:ఏం మాయ చేశావే అనే సినిమాతో ఒక్కటైన చై, సామ్ల బంధం మెల్లగా ప్రేమవైపు పయనించి, కడకు పరిణయంగా రూపాంతరం చెందింది. ఉత్తమమైన జంట వీరిదని అందరూ అనుకుంటుండగానే చివరికి విడాకులతో వీరి కథ ముగిసింది. ఇక వీరిద్దరు తీసుకున్న నిర్ణయం అభిమానులను ఎంతగానో ఆవేదనకు గురి చేసింది. ఈ క్రమంలో ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా తమ బాధను వ్యక్తం చేశారు. చూడ ముచ్చటగా ఉండే జంట విడిపోవడంపై రకరాకల కామెంట్లు పెట్టారు.
Cancer: క్యాన్సర్ మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే ఇది ఒక్కటి తినండి చాలు..!!
Samantha: దీనిపైన నాగార్జున స్పందన ఇదే..
అయితే ఈ వార్తలపై నాగచైతన్య కానీ నాగార్జున కానీ ఎప్పుడూ స్పందించింది లేదు. అయితే తాజాగా తొలిసారి నాగార్జున చై, సామ్ విడాకుల వ్యవహారంపై పెదవి విప్పారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “కావాలనే కొందరు పనిగట్టుకొని చెత్త రాతలు రాస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఇలాంటి ఫేక్ వార్తలకు వేదికగా మారుతుంది. ఇలాంటి ఫేక్ న్యూస్ను నేను పట్టించుకోను.” అంటూ నాగార్జున కొంచెం ఎమోషనల్ అవుతూ మాటాడారు.
Cancer: క్యాన్సర్ మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే ఇది ఒక్కటి తినండి చాలు..!!
ఈ విషయమై కొన్ని ఫేక్ వార్తలు వచ్చాయి.. అవి ఇవే..
నిన్న మొన్నటి వరకు కొందరు ఈ విషయమై సమంత, నాగార్జునను టార్గెట్ చేస్తూ రకరకాల కామెంట్లు చేశారు. సమంత బోల్డ్ పాత్రలు చేయడం నాగార్జునకు అస్సలు నచ్చలేదని, అక్కినేని కుటుంబం సమంతకు పిల్లలు కనడం విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిందని ఇలా రకరకాల వార్తలు హల్ చల్ చేసాయి. ఒకానొక సమయంలో తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా సామ్ కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే.