న్యూఢిల్లీ: సమాచార కమిషనర్ల నియామకం విషయంలో గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. నాలుగు వారాల్లో నియామక పక్రియపై తీసుకున్న చర్యల నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్రం, ఆంధ్రప్రదేశ్తో సహా తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
కేంద్ర సమాచార శాఖ కమిషనర్ (సిఐసి), రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ (ఎస్ఐసి) నియామకాలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టింది.
కమిషనర్ల నియామకాల్లో సుప్రీం కోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడం లేదని సమాచార హక్కు చట్టం కార్యకర్త అంజలీ భరద్వాజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.