జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తమిళ్ మీడియా గందరగోళ వాదిగా అభివర్ణించింది. రాజకీయాల్లోకి ప్రశ్నించడానికి వచ్చాను అంటూ బిజెపి పార్టీ తో పొత్తు పెట్టుకోవడం పై విమర్శలు చేస్తూ తమిళ మీడియా కథనాలు వెలువడటం రాజకీయవర్గాలలో ఆసక్తికరంగా మారింది. తమిళ సాయంకాల దినపత్రిక మురుసు తాజాగా పవన్ కళ్యాన్ పై ఓ కథనం ప్రచురించడం ఆసక్తి రేపుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొదట పోటీలోకి దిగాలని భావించిన పవన్ కళ్యాణ్ తర్వాత డ్రాప్ అవటం అందరికీ తెలిసిందే. బిజెపి పార్టీ నేతలను కలిసిన తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పవన్ ప్రకటించారు. అయితే ఆ సమయానికి జనసేన పార్టీకి చెందిన అభ్యర్థులు 50 మంది నామినేషన్లు వేయగా వాటిని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు ఆ కథనంలో తెలిపి పవన్ ని విమర్శించారు.
2014 ఎన్నికల సమయంలో పార్టీ పెట్టి బిజెపి టిడిపి కూటమికి మద్దతు ఇచ్చి నవ్వుల పాలయ్యారు తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో లెఫ్ట్ పార్టీ నేతలతో పాటు మాయావతి తో పొత్తు పెట్టుకున్నారని మళ్లీ ఇప్పుడు బీజేపీ పంచన చేరారు అంటూ కథనం ప్రసారం చేస్తూ గందరగోళ రాజకీయ నేతగా పవన్ ని తమిళ మీడియా దుమ్మెత్తి పోసింది. పొలిటికల్ రంగంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రారంభంలో కమ్యూనిస్టు భావజాలం అదేవిధంగా బహుజన వాదం అన్నట్టు ప్రసంగాలు చేసి ఇప్పుడు కాషాయం లోకి వెళ్లిపోయారని తమిళ మీడియా పవన్ ని అభివర్ణిస్తుంది. తనకి కులం లేదు మతం లేదు అని చెప్పిన పవన్ ఇప్పుడు మతతత్వ పార్టీగా ముద్ర పడ్డ బీజేపీతో స్నేహం చేయడం పట్ల నిలకడలేని రాజకీయ నేతగా పవన్ ని తమిళ్ మీడియా దుమ్మెత్తి పోస్తూ ఉంది. అవసరానికి తగ్గట్లు పవన్ మారటం పట్ల అతని విశ్వసనీయత రోజు రోజుకి తగ్గిపోతుందని తమిళ మీడియా ఆరోపించింది.