అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో నిర్మించిన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి మత పెద్దలు చంద్రబాబుకు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యాలయంలో టిఆర్ కాంశ్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.75వేల అడుగులతో జీప్లస్-3గా భవనాన్ని నిర్మించారు. మూడవ అంతస్తులో చంద్రబాబు, లోకేష్ ఛాంబర్స్ ఉండగా గ్రౌండ్ ఫ్లోర్లో మీడియా, రాష్ట్ర అధ్యక్షుడి ఛాంబర్ రూమ్లు కేటాయించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన నాయకులు పాల్గొన్నారు.
previous post