విజయవాడ: అమరావతి ప్రాంత ప్రజల గొంతు నొక్కడం సాధ్యం కాదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. వేలాది మంది పోలీసులతో గ్రామాల్లో కవాతు చేయించినంత మాత్రాన ఉద్యమాన్ని అణచలేరని ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.” టెంటు పీకేసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోదు. జగన్ నిరంకుశ పాలనకు రాజధానిలో ఉన్న పరిస్థితులే నిదర్శనం. మీరు ఎంత తొక్కితే అంత ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడుతుంది జగన్ గారు. రైతులను ఎండలో కూర్చోబెట్టిన పాపం ఊరికే పోదు. వైసీపీ ప్రభుత్వానికి పాడె కట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు గళం విప్పుతున్నారు. గ్రామాల్లోని గుళ్లకు కూడా తాళం వేసే పరిస్థితి వచ్చిందంటే… రాష్ట్రంలో ఎంత ఘోరమైన పాలన కొనసాగుతోందో అర్థమవుతోంది” అని పేర్కొన్నారు. ఇది ఆగే ఉద్యమం కాదు సాగే ఉద్యమం అని చెప్పారు. పోలీసులు లాఠీ, బూటు చప్పుళ్లతో దీనిని ఆపలేరని లోకేశ్ చెప్పారు.
రైతులను నడి రోడ్డు పై ఎండలో కూర్చోబెట్టిన పాపం ఊరికే పోదు. వైకాపా ప్రభుత్వానికి పాడె కట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు గళం విప్పుతున్నారు. గ్రామాల్లో గుడికి తాళం వేసే దుస్థితి వచ్చింది అంటే రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిపాలన ఉందో అర్ధం అవుతుంది.(2/2)#MyCapitalAmaravati
— Lokesh Nara (@naralokesh) January 11, 2020
ఇది ఆగే ఉద్యమం కాదు… సాగే ఉద్యమం…
పోలీసు లాఠీ, బూటు చప్పుళ్లతో దీనిని ఆపలేరు @ysjagan గారు..#SaveAmaravati#MyCapitalAmaravati pic.twitter.com/bmOfA1zEkV— Lokesh Nara (@naralokesh) January 11, 2020