Ukraine Russia War: రష్యా ఉన్న కొద్ది ఉక్రెయిన్ పై పట్టు సాధిస్తూ దూసుకుపోతూ ఉంది. రెండు దేశాల మధ్య జరుగుతున్న భీకరయుద్ధంలో.. సామాన్యులు బలైపోతున్నారు. నాటో దేశాలు నమ్మి… నట్టేట మునిగిన పోయింది. రష్యా వేటాడే సింహం మాదిరిగా ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడుతోంది. ఇటువంటి తరుణంలో అక్కడే చిక్కుకుపోయిన భారత విద్యార్థులు… యుద్ధవాతావరణం దాటికి తింటా కి ఆహారం పడుకోడానికి షెల్టర్ కూడా లేని పరిస్థితి ఉన్నట్లు .. కాపాడాలని అభ్యర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో స్వదేశంలో వీళ్లకు సంబంధించిన వాళ్ళు బెంగా పెట్టుకుంటున్నారు.
దాదాపు 20 వేల మంది విద్యార్థులు పౌరులు… ఉక్రెయిన్ లో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం వాతావరణం మరింతగా ముమ్మరం అవుతున్న నేపథ్యంలో… కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లో అవస్థలు పడుతున్న భారతీయులను ప్రత్యేక విమానం ద్వారా స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసింది. రొమేనియా సరిహద్దు ప్రాంతమైన పొరుబ్నే-సీరెత్ వద్ద, హంగరీ సరిహద్దు ప్రాంతమైన చోప్ జొహోనీ వద్ద… కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలో సరిహద్దుల వద్దకు వచ్చే విద్యార్థులు తమ వాహనాలకు భారత జెండా పట్టుకొని… చేరుకోవాలని సూచించింది. భారత రాయబార కార్యాలయం.. మొత్తం అంతా చెక్ చేసి … అప్పుడు విమానం ఎక్కే ఏర్పాట్లు చేయనున్నట్లు.. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వనున్నట్లు.. కేంద్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాలు ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారి కోసం ప్రత్యేకమైన కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే రాకపోకలకు సంబంధించి విద్యార్థులు తీసుకురావడానికి ఎటువంటి ఖర్చు తీసుకోవడం లేదని మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని శనివారం తెల్లవారుజామున భారత్ నుండి ఈ ప్రత్యేకమైన విమానాలు ఉక్రెయిన్ కి చేరుకుంటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.