విజయవాడ, మార్చి 24: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి చలసాని అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సిపిఐ పట్ల అవమానకరంగా వ్యవహరించారని అన్నారు. తనకు టికెట్ ఖరారు చేసిన తరువాత వేరే వారిక పేరు ఎలా ప్రకటించారని అజయ్ కుమార్ ప్రశ్నించారు.
నూజివీడు అసెంబ్లీ సీటు, విజయవాడ పార్లమెంట్ సీటు మార్పు వెనుక ఉన్న వాస్తవాలు రెండు రోజుల్లో బయటకు వస్తాయని అజయ్ కుమార్ అన్నారు. తాను విజయవాడ ఎంపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని చెప్పారు. పార్టీ నిర్ణయం మేరకు ఎన్నికల ప్రచార సామాగ్రి కూడా సమకూర్చుకున్నానని అజయ్కుమార్ తెలిపారు. హఠాత్తుగా జనసేన అభ్యర్థిగా వేరే వారికి ఎలా ప్రకటించారు, దీని వెనుక ఎవరి వత్తిడి ఉందని అజయ్ కుమార్ ప్రశ్నించారు. వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని అజయ్ కుమార్ వెల్లడించారు.