40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అనేక కష్టాలు ప్రస్తుతం పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా 2014 ఎన్నికల సమయంలో గెలిచిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మహా పాపంగా మారి బాబు గారిని వెంటాడుతున్నాయి అని మేధావులు అంటున్నారు. రాజధాని వికేంద్రీకరణ అంటూ జగన్ తీసుకున్న నిర్ణయానికి ఉలిక్కిపడ్డ చంద్రబాబు తన కలల రాజధాని అమరావతి విషయం లో కేంద్రం సహాయం కోరుతున్న అటునుండి రెస్పాండ్ రాకపోవడం దురదృష్టకరం అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
రాజధాని బిల్లు మరియు సిఆర్డిఎ చట్టాన్ని చంద్రబాబు తన హయాంలో కనీసం పార్లమెంటులో ఈ నిర్ణయం రాష్ట్రంలో తీసుకుంటున్నట్లు సమాచారం ఇవ్వకపోవడం, సొంత బుద్ధితో ఏర్పాటు చేసుకున్న రాజధాని సామ్రాజ్యం ఇప్పుడు చంద్రబాబుని నట్టేట ముంచాయి. రెండోసారి కూడా తాను అధికారంలోకి వస్తామన్నట్టుగా, తనని ఎవరు అడ్డుకుంటారో అన్నట్టుగా వ్యవహరించడంతో… ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన్ని ఇప్పుడు దెబ్బ కొట్టినట్లు మేధావులు చెప్పుకొస్తున్నారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతి ని వికేంద్రీకరిస్తూ సిఆర్డిఎ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ విషయంలో హైకోర్టులో వాదనలు జరుగుతున్నయి. ఈ విషయంలో కేంద్రం చాలా వరకు జగన్ ప్రభుత్వానికి మద్దతు వచ్చే రీతిలో వ్యవహరిస్తుంది. రాష్ట్ర రాజధాని విషయంలో గత ప్రభుత్వం తమతో సంప్రదింపులు జరపడం లేదని హైకోర్టులో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
అంతేకాకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా రాజధాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమతో సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేసింది. మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఎవరితో సంప్రదింపులు జరపకుండా తీసుకున్న నిర్ణయాలు మహా పాపంగా మరి చంద్రబాబు అమరావతి విషయంలో ఎలాంటి అండ లేని రీతిలో పరిస్థితి మార్చినట్లు మేధావులు చెప్పుకొస్తున్నారు.