కేసీఆర్ కు తెలంగాణలో తిరుగులేదు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ను విజయపథంలో నడిపి సీఎం అయ్యారు.. కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ఆయనకు తిరుగులేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా తెలంగాణలో టీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుంది. తనయుడు కేటీఆర్ ఆయనకు కొండంత బలం. కుమార్తె కవిత కూడా ఆయనకు బలమే. ప్రస్తుతం ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోదామని ప్లాన్ చేసుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్లేలోపు రాష్ట్రంలో వారికి ఒక ప్లాట్ ఫామ్ క్రియేట్ చేయాలనేది కేసీఆర్ ప్లాన్.
కేటీఆర్ కు సీఎం.. కవితకు మంత్రి..
కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టాలంటే రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దాలి. కేటీఆర్ కు సీఎం అయ్యే స్థాయి ఉంది. కేసీఆర్ కు కేటీఆర్ పెద్ద బలం. కాబట్టి రాష్ట్ర రాజకీయాలపై ఆయనకు భయం ఉండదు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేటర్ స్థానాలు గెలిపించారు కేటీఆర్. ప్రస్తుతం కొత్త సచివాలయం నిర్మాణం కూడా జరుగుతోంది. ఇక కుమార్తె కవితను సెటిల్ చేస్తున్నారు. ఎంపీగో ఓటమి చూసిన తర్వాత కవితకు రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్లాన్ చేశారు. ఇందుకు కూడా లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్సీగా ఆమె గెలిచారు. ఇప్పుడు మంత్రిని చేయడమే మిగిలింది. దీంతో తండ్రిగా, రాష్ట్రాధినేతగా ఆయన బాధ్యతలు నెరవేర్చినట్టే.
ఢిల్లీ రాజకీయాలపైనే పూర్తి దృష్టి..
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, స్టాలిన్.. తదితరులను గతంలోనే కలిశారు కేసీఆర్. అయితే.. అప్పుడు సమయం చిక్కలేదు. 2023లో ఎన్నికలు రానున్నాయి. మరోవైపు జమిలీ ఎన్నికలు 2022లోనే అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన అటువైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలన తర్వాత బీజేపీ వచ్చింది. బీజేపీ కూడా పదేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. ప్రజలు కొత్త వ్యవస్థను కోరుకుంటారు. కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేదు. ఈ గ్యాప్ లో ఫెడరల్ ఫ్రంట్ ను సిద్ధం చేయాలనేది ఆయన ప్లాన్. బీజేపీపై చాలామంది నాయకులు విముఖంగానే ఉన్నారు. ఎన్నికల్లో ఫ్రంట్ ను గెలిపిస్తే ప్రధాని కావొచ్చొనేది ఆయన ప్లాన్. మరి ఆయనకు అవకాశం కలిసి వస్తుందా. మిగిలిన నాయకులు ఆయనకు సహకరిస్తారా? అనేది ప్రశ్నార్ధకమే.