ఢిల్లీ : ఢిల్లీ పర్యటన పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ఆరోపించారు.
రాష్ట్రంలో పోలింగ్ నిర్వహణలో లోపాలు, ఈవిఎంల మొరాయింపులపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాకు ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు శనివారం ఢిల్లీ వెళ్లరు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై జివిఎల్ స్పందించారు.
‘గతంలో ఢిల్లీకి రాజకీయాలకు వెళ్లి రెండు కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేశారు. ‘విశ్రాంత’ సిఎం చంద్రబాబు గారు, ప్రజాధన దుర్వినియోగం ఆపాలి. మీరు ఈ రోజు ఢిల్లీకి టిడిపి అధక్షుడి హోదాలో వెళ్లారు. మీ పార్టీ నిధుల్ని వెచ్చించాలి. ప్రజాధనాన్ని వాడితే మీ నుంచి, అధికారుల నుంచి వసూలు చేయాలి’ అని జివిఎల్ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్రప్రభుత్వ తీరును నిరసిస్తూ చంద్రబాబు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షకు 2.83 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు చంద్రబాబు వెల్లడించారు. దీన్ని ప్రస్తావిస్తూ జివిఎల్ ట్వీట్ చేశారు.
పోయినసారి ఢిల్లీకి రాజకీయాలకు వెళ్లి 2 కోట్ల ప్రజల సొమ్మును వృథా చేసారు. 'విశ్రాంత' సీఎం చంద్రబాబు గారు, ప్రజాధన దుర్వినియోగం ఆపాలి. మీరు ఈరోజు ఢిల్లీ టీడీపీ అధక్షుడి హోదాలో వెళ్లారు. మీ పార్టీ నిధుల్ని వెచ్చించాలి. ప్రజాధనాన్ని వాడితే మీనుంచి, అధికారులనుంచి వసూలు
చేయాలి. @ncbn pic.twitter.com/wweKyR9DD3— GVL Narasimha Rao (@GVLNRAO) April 13, 2019
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?