(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా బుద్దా విమర్శల వర్షం కురిపించారు.
అమ్మ ఒడి కింద 15 వేల రూపాయల ప్రయోజనం పొందిన 43 లక్షల కుటుంబాలు సంక్రాంతి ముందే వచ్చిందని మురిసిపోతుంటే ఇన్సైడర్ భూముల కోసం చంద్రబాబు జోలె పట్టుకుని లాంగ్ మార్చ్ చేస్తుండటం అందరికీ చికాకు తెప్పిస్తోందనీ, పండుగ కూడా ప్రశాంతంగా చేసుకోనిచ్చేలా లేడని ప్రజలు విసుక్కుంటున్నారనీ విజయసాయిరెడ్డి విమర్శించారు.చంద్రబాబు లాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో ఎక్కడా కనిపించడనీ, స్పెషల్ స్టేటస్ ఉద్యమంలో పాల్గొంటే అరెస్టు చేస్తామని అప్పట్లో విద్యార్థులు, తల్లిదండ్రులకు వార్నింగ్లు ఇచ్చి ఇప్పుడేమో తమ ఇన్ సైడర్ పెట్టుబడులను రక్షించుకునేందుకు స్టూడెంట్స్ అంతా రోడ్డుపైకి రావాలంటున్నారనీ విజయసాయి రెడ్డి విమర్శించారు.
ఈ విమర్శలపై బుద్దా వెంకన్న స్పందిస్తూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో జగన్ అల్లకల్లోలం సృష్టించారని విమర్శించారు. ఆనందంగా పండుగ జరుపుకోవడానికి పేద వాడికి పండుగ కానుక కూడా జగన్ ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో పనులు కూడా లేకుండా చేశారన్నారు. కనీసం అన్న క్యాంటిన్లో తిందాం అనుకుంటే అవి కూడా ఎత్తేసారని బుద్దా అన్నారు. ఎడు నెలల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వం నాకించి ప్రజలు పండుగకు దూరం అవ్వడానికి చంద్రబాబు కారణం అంటే ఎలా అని విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. ‘మేము పండుగ చేసుకుంటే చాలు అనుకునేది వైఎస్ కుటుంబం. ప్రజలు కష్టాల్లో ఉంటే మనం పండుగ చేసుకోవడం కరెక్టు కాదు అనుకునేది చంద్రబాబు కుటుంబం. ఈ రెండిటి మధ్యా ఉన్న సున్నితమైన భావాన్ని మీరు అర్థం చేసుకుంటారు అని భావిస్తున్నా సాయి రెడ్డి గారూ’ అని బుద్దా వ్యాఖ్యానించారు.
శాంతియుతంగా ధర్న చేస్తున్న మహిళల్ని బూటు కాలితో తన్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న వారిపై అక్రమ కేసులా, చిన్న పిల్లాడిని పోలీసు వ్యాన్ ఎక్కిస్తారా అని బుద్ద ప్రశ్నించారు. సిగ్గు గురించి విజయసాయి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తాం నాడు చెప్పి నేడు వంగి దండాలు పెడుతున్నారని బుద్దా విమర్శించారు.
మేము పండుగ చేసుకుంటే చాలు అనుకునేది వైఎస్ కుటుంబం. ప్రజలు కష్టాల్లో ఉంటే మనం పండగా చేసుకోవడం కరెక్ట్ కాదు అనుకునేది చంద్రబాబు కుటుంబం. ఈ రెండిటి మధ్యా ఉన్న సున్నితమైన భావాన్ని మీరు అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నా సాయి రెడ్డి గారు(3/3)
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) January 12, 2020
మేము పండుగ చేసుకుంటే చాలు అనుకునేది వైఎస్ కుటుంబం. ప్రజలు కష్టాల్లో ఉంటే మనం పండగా చేసుకోవడం కరెక్ట్ కాదు అనుకునేది చంద్రబాబు కుటుంబం. ఈ రెండిటి మధ్యా ఉన్న సున్నితమైన భావాన్ని మీరు అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నా సాయి రెడ్డి గారు(3/3)
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) January 12, 2020