విజయవాడ: దక్షిణాఫ్రికా వారు మూడు రాజధానుల వల్ల తమ దేశం నష్ట పోతుందని మొత్తుకుంటుంటే ఏపీకి మూడు రాజధానులు ఎందుకుని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. మూడు రాజధానులను రెండింటికి కుదించాలని దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకమ్ జుమా గతంలో ప్రకటించిన విషయాన్ని నాని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
‘సౌత్ ఆఫ్రికా వారు మూడు రాజధానుల వల్ల తమ దేశం నష్ట పోతుందని మొత్తుకుంటుంటే మన ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఎందుకు ముఖ్యమంత్రి గారూ?’ అని ట్విట్టర్ లో కేశినేని నాని ప్రశ్నించారు.
సౌత్ఆఫ్రికా వారు మూడు రాజధానులు వల్ల మా దేశం నష్ట పోతుంది అని మొత్తు కుంటుంటే మన ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఎందుకు ముఖ్యమంత్రి గారూ@ysjagan pic.twitter.com/avuSZYc8Qx
— Kesineni Nani (@kesineni_nani) December 19, 2019
కాగా, దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని, ఏపీకి మూడు రాజధానులు రావొచ్చు అని ముఖ్యమంత్రి జగన్ గత మంగళవారం అసెంబ్లీలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఏపీ పాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, చట్టసభలతో ‘అమరావతి’ని రాజధానిగా చేయాలని అన్నారు. అయితే, జగన్ ప్రకటనపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.