తెలంగాణలో మరో ఎన్నికకు సిద్ధం అవుతోంది. 2018 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి (టి జె ఎస్) ఎన్నికకు సిద్ధం అవుతోంది. సిఎం కె సి ఆర్ కు చెమటలు పట్టించేలా, టీ ఆర్ ఎస్ నేత టి ఆర్ కు చుక్కలు చూపించేలా తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్ ఎస్) హవా తగ్గించేలా ఈ సారి కోదండరాం బృందం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది,
పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా 2018 ఎన్నికల్లో టి జె ఎస్ పోటీ చేసిన దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకశం ఉంది. ఈ నేపథ్యంలో వీటిపై చర్చించేందుకు సోమవారం నాంపల్లిలోని టి జె ఎస్ కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎలా వ్యవహారించాలనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. టి జె ఏస్ చైర్మన్ గా ప్రజా సంఘాలను, అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాంకు పట్టభద్రులల్లో మంచి ఆదరణ ఉంది. కోదండరాం పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో ఉంటే గెలుపు సునాయాసమే అని టి జె ఎస్ భావిస్తున్నది,
టి ఆర్ ఎస్ మినహా మిగతా అన్ని పార్టీల మద్దతు కూడగట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టి జె ఎస్ నిర్ణయించినట్లు సమాచారం. వరంగల్లు, ఖమ్మం, నల్లగొండ స్థానం నుండి కోదండరాం పోటీ చేయాలని టి జె ఎస్ నేతలు కోరారు. ఏ నిర్ణయమైనా పార్టీ సమిష్టిగా తీసుకోవాలని కోదండరాం పేర్కొన్నారు. త్వరలో మరో సారి సమావేశమై రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో భాగంగా ఇతర పార్టీలు, ప్రజా సంఘాల నేతల అభిప్రాయాలు. వారి మద్దతుపై చర్చించాలని సమావేశం నిర్ణయించింది, ఇది ఇలా ఉండగా అధికార టీ ఆర్ ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఏ విధంగా ఫేస్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న కేసీఆర్ నేతృత్వం లోని టీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాం బరిలో ఉంటే టీ ఆర్ ఎస్, టీ జె ఎస్ మధ్యనే ప్రధాన పోటీ ఉండవచ్చని అనుకుంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?