దేశ ప్రధాని మోడీ చాలా రాష్ట్రాలలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బీజేపీ పార్టీని బలోపేతం చేసే దిశగా దూసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ చేత వెనక ఉండి మోడీ రాజకీయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో ఏపీ పై కూడా మోడీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లు జాతీయ రాజకీయాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయ మొత్తం రాజధాని చుట్టూ తిరుగుతుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవిధంగా ముందుకు వెళుతుంది అన్నదానిపై స్పష్టత లేదు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రాక…
ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి రెడీ అయినట్లు షాకుల మీద షాకులు ఇవ్వడానికి మోడీ కేంద్ర మంత్రులను ఏపీలో దింపు తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే గత కొంత కాలం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కేంద్రానికి వచ్చే ఆదాయం తగ్గిందట. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అసలు రాష్ట్రంలో ఆర్థిక వనరులు ఎందుకు తగ్గాయి ఏంటి అనే దానిపై దృష్టి పెట్టడానికి రెడీ అయినట్లు, దానికి సంబంధించి స్వయంగా నిర్మలాసీతారామన్ రాష్ట్ర ఆర్థిక మంత్రితో భేటీ అయి రాష్ట్రంలోనే కొన్ని రోజులు ఉండి పరిస్థితి క్షుణ్ణంగా తెలుసుకుని రిపోర్ట్ ప్రధానికి ఇవ్వటానికి రెడీ అవుతున్నట్లు టాక్.
కేంద్ర హోంశాఖ మినిస్టర్ ఏపీకి….
అంతేకాకుండా ఏపీలో పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న ట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ అసలు ఏ రీతిగా పనిచేస్తుంది అన్న దానిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా రాష్ట్రంలో అడుగుపెట్టి కొన్ని పోలీస్ స్టేషన్లను స్వయంగా సందర్శించే అవకాశం ఉందని జాతీయ రాజకీయాల్లో టాక్. దీంతో రాబోయే రోజుల్లో కేంద్రం ఏపీని గట్టిగానే టార్గెట్ చేసినట్లు….జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉండవు అన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ చాలావరకు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.
జల జగడం పంచాయతీ….
మరోపక్క రాష్ట్ర బిజెపి మెల్లమెల్లగా పుంజుకుంటుంది. దీంతో ఇలాంటి సమయంలో అధికార పార్టీని కొద్దిగా ఇరుకున పెట్టే రీతిలో వ్యవహరిస్తే బీజేపీకి ఏపీలో భవిష్యత్తు ఉంటుందని మోడీ ప్లాన్ చేసినట్లు టాక్. అదే రీతిలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జల వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా రాబోతున్నారట. దీంతో కేంద్రంలో ఉండే ముగ్గురు కీలక మంత్రులు ఏపీలో అడుగు పెడుతున్నట్లు వార్తలు విని ఏపీలో ఉన్న రాజకీయ నాయకులు ఇదేం మోడీ ప్లాన్ బాబోయ్ అని ఇక మేమంతా పొలిటికల్ గా దుకాణాలు సర్దుకోవాల్సిందేనా అని వ్యాఖ్యానిస్తున్నారట. .