అమరావతి: పోలవరం రివర్స్ టెండర్ల వల్ల 7500 కోట్ల రూపాయల నష్టం వస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు కాకిలెక్కలు చెబుతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. రివర్స్ టెండరింగ్పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు గురువారం విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు.
ఆయిదేళ్ల చంద్రబాబు హయాంలో దోచుకున్న అయిదు లక్షల కోట్ల రూపాయలతో పాటు వరుస కరువు వల్ల వ్యవసాయ రంగం లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తి కోల్పోయిందనీ, వాటి గురించి చంద్రబాబు మాట్లాడితే బాగుంటుందనీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
డిఎంకె పార్టీ ఆధ్వర్యంలో నడిచే ‘మురసోలి’ పత్రిక, శివసేన పార్టీ సొంత పత్రిక ‘సామ్నా’ ప్రత్యర్థి పార్టీలను విమర్శలతో చీల్చి చెండాడినా నైతిక విలువలు పాటిస్తాయనీ, అవాస్తవాలు రాయవనీ విజయసాయిరెడ్డి కితాబు ఇచ్చారు.
చంద్రబాబు మౌత్ పీస్ ‘కిరసనాయిలు’ మాత్రం జర్నిలిజం ముసుగులో విషం కక్కుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.
డీఎంకే పార్టీ ‘మురసోలి’ అనే పత్రికను నడుపుతోంది. శివసేన పార్టీ సొంత పత్రిక ‘సామ్నా’. ఇవి ప్రత్యర్థి పార్టీలను విమర్శలతో చీల్చి చెండాడినా నైతిక విలువలు పాటిస్తాయి. అవాస్తవాలను రాయవు. @ncbn మౌత్పీస్ ‘కిరసనాయిలు’ మాత్రం జర్నలిజం ముసుగులో విషం కక్కుతున్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 3, 2019
పోలవరం రివర్స్ టెండర్ల వల్ల 7500 కోట్ల నష్టం వస్తుందని కాకి లెక్కలు చెబుతున్నారు @ncbn. తమరు పాలించిన ఐదేళ్లలో దోచుకున్నది ఐదు లక్షల కోట్లు. వరుస కరువు వల్ల వ్యవసాయ రంగం లక్ష కోట్ల ఉత్పత్తి కోల్పోయింది. వాటి గురించి మాట్లాడితే బాగుంటుంది మీరు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 3, 2019