చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నడూ ఎదురుకాని రాజకీయ సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్లు చాలామంది సీనియర్లు చెప్పుకొస్తున్నారు. తన రాజకీయ ఎత్తుగడలతో మహామహులను మట్టికరిపించిన చంద్రబాబు ఒక్క జగన్ విషయంలో మాత్రం బోల్తా పడ్డారని అంటున్నారు. 2019 ఎన్నికల ఫలితాల జగన్ దెబ్బకి చంద్రబాబు కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొస్తున్నారు. కనీసం పార్టీ ని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలోకి చంద్రబాబు వెళ్లిపోయారని పేర్కొంటున్నారు.
గతంలో చంద్రబాబు అంటే పార్టీలో ఉన్న నేతలకు హడల్ అని… కానీ ప్రస్తుతం ఎవరు చంద్రబాబు ని లెక్క చేయడం లేదని పేర్కొంటున్నారు. టిడిపిలో గెలిచిన ఎమ్మెల్యేలు వైసిపి పార్టీ వైపు చూస్తుంటే ఎంపీలు బిజెపి వైపు చూస్తున్నారని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ఇద్దరూ కూడా టిడిపిని నిర్వీర్యం చేసే రీతిలో వ్యవహరిస్తున్నారని చెప్పుకొస్తున్నారు.
కచ్చితంగా రాష్ట్రంలో టిడిపి పార్టీ పరిస్థితి చూసి వైఎస్ ఆత్మ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది… తన కొడుకు దెబ్బ కి చంద్రబాబు రాజకీయ కెరియర్ డేంజర్ జోన్ లో పడినందుకు అని సీనియర్లు అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు రాజకీయ అనుభవం వయసు కలిగిన జగన్ టీడీపీని నిర్వీర్యం చేయడం గ్యారెంటీ అని.. బలంగా సీనియర్లు చెప్పుకొస్తున్నారు. మరోపక్క చంద్రబాబు వయసు మీదపడటంతో… పార్టీలో ఉన్న నాయకులు కూడా అభద్రతాభావంతో ఎవరికి వారు ఇతర పార్టీ వైపు చూస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు గట్టిగా వస్తున్నాయి. ఇదిలా ఉండగా త్వరలో బిజెపి పార్టీకి చెందిన ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని బీజేపీ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్లు వార్తలు జాతీయస్థాయిలో వినబడుతున్నాయి. ఈ జాబితాలో గల్లా జయదేవ్ ముందుగా ఉన్నట్లు నేషనల్ పాలిటిక్స్ లో టాక్.