ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ను నిర్వహిస్తోంది. ఈ సేల్ బుధవారం ప్రారంభం కాగా ఆగస్టు 28వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో అనేక కంపెనీలకు చెందిన ఫోన్లను తగ్గింపు ధరలకు ఇస్తున్నారు. పలు ఫోన్లపై అదనంగా రూ.1వేయి వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ను అందిస్తున్నారు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
ఈ సేల్లో ఐఫోన్ ఎస్ఈ 2020కి చెందిన 64జీబీ మోడల్ రూ.42,500కు బదులుగా రూ.35,999కు లభిస్తోంది. 128జీబీ మోడల్ రూ.47,800కు బదులుగా రూ.40,999కు లభిస్తోంది. 256జీబీ మోడల్ రూ.58,300కు బదులుగా రూ.50,999 ధరకు లభిస్తోంది. ఈ ఫోన్పై నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ ఎక్స్ఆర్ ఫోన్పై రూ.6,501 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ 64జీబీ మోడల్ రూ.52,500కు బదులుగా రూ.45,999కు లభిస్తోంది. 128 జీబీ మోడల్ రూ.57,800కు బదులుగా రూ.51,999కు లభిస్తోంది. దీనిపై కూడా నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ సదుపాయాలు పొందవచ్చు.
సేల్లో రెడ్మీ కె20 రూ.21,599కు బదులుగా రూ.19,999కు లభిస్తోంది. ఎక్స్ఛేంజ్ చేస్తే ఈ ధర ఇస్తారు. ఒప్పో రెనో 2ఎఫ్ ఫోన్ ధర రూ.18,990కి బదులుగా రూ.17,990 గా ఉంది. ఒప్పో ఎ5ఎస్ ధర రూ.8,990 నుంచి రూ.7,990కి తగ్గింది.
ఇవే కాకుండా రియల్మి ఎక్స్50 ప్రొ 5జి, ఐక్యూ 3, ఒప్పో ఎ12, వివో వై50, మోటోరోలా రేజర్, ఒప్పో రెనో 2జడ్, రెనో 2, రెనో 10ఎక్స్ జూమ్, శాంసంగ్ గెలాక్సీ ఎ71, ఎల్జీ జీ8ఎక్స్ థిన్క్యూ ఫోన్లపై కూడా డిస్కౌంట్లను ఇస్తున్నారు.