షియోమీ నుంచి విడిపోయి పోకో ఒక స్మార్ట్ ఫోన్ బ్రాండ్గా అవతరించినప్పటి నుంచి ఆ బ్రాండ్ కింద పలు ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. ఇప్పటి వరకు పోకో విడుదల చేసిన అన్ని ఫోన్లు ధర తక్కువ ఉండడమే కాదు, ఫీచర్లు కూడా వాటిల్లో అద్భుతంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ కంపెనీ కొత్తగా పోకో ఎం2 పేరిట మరో స్మార్ట్ ఫోన్ను మంగళవారం విడుదల చేసింది. ఈ ఫోన్ భారత మార్కెట్లో త్వరలో లభ్యం కానుంది.
పోకో ఎం2 స్మార్ట్ ఫోన్ లో… 6.53 ఇంచుల డిస్ప్లేను ఇచ్చారు. దీనికి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. ఈ ఫోన్లో మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు. 6జీబీ ర్యామ్ ఉంది. అందువల్ల ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. ఈ ఫోన్ 64జీబీ, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లలో విడుదలైంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ను ఇందులో ఇచ్చారు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడు 8, 5, 2 మెగాపిక్సల్ కెమెరాలు మూడు ఉన్నాయి. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు.
ఈ ఫోన్లో రెండు 4జీ సిమ్లను వేసుకోవచ్చు. మెమొరీని కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. బ్లూటూత్ 5.0ను ఇచ్చారు. యూఎస్బీ పోర్టు ద్వారా ఫోన్ను చార్జింగ్ పెట్టుకోవచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో ఇవ్వగా, దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీంతో ఫోన్ వేగంగా చార్జ్ అవుతుంది.
* పోకో ఎం2 ఫోన్ 6జీబీ ర్యామ్, 64జీబీ మోడల్ ధర రూ.10,999.
* 6జీబీ ర్యామ్, 128జీబీ మోడల్ ధర రూ.12,499.
సెప్టెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్కు ఫ్లిప్కార్ట్లో ఫ్లాష్ సేల్ నిర్వహిస్తారు.