కామారెడ్డి – జగిత్యాల మాస్టర్ ప్లాన్ అంశంపై రైతుల పోరాటం ఫలిచింది. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలు, రాస్తారోకోలు చేయడంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనలతో మున్సిపల్ పాలకవర్గం దిగివచ్చింది. జగిత్యాల జిల్లా మాస్టర్ ప్లాన్ ను రద్దు చూస్తూ శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పాత ముసాయిదా డ్రాఫ్ట్ ను రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ ఆరు గ్రామాల రైతులు, గ్రామస్తులు ఆందోళనలు చేస్తుండగా, వీరి ఆందోళనకు వివిధ రాజకీయ పక్షాలు మద్దతు తెలియజేశాయి.
గత ఏడాది డిసెంబర్ 15న మాస్టర్ ప్లాన్ ముసాయిదా నోటిఫికేషన్ వెలువడింది. రైతుల నిరసనతో మంత్రి కొప్పుల ఈశ్వర్ .. మాస్టర్ ప్లాన్ ను సవరిస్తమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ కౌన్సిల్ లో రద్దు తీర్మానం ప్రవేశపెట్టడం, ఎమ్మెల్యే సంజయ్ కుమర్, చైర్ పర్సన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాస్టర్ ప్లాన్ రద్దుకై ఇవేళ కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేసం జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్ తో కలిపి మొత్తం 49 మంది వార్డు కౌన్సిలర్లు సమావేశానికి హజరైయ్యారు.
సమావేశం అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి మీడియాతో మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ పై రైతులు ఆందోళన చేస్తున్న కారణంగా దానిపై స్పష్టత కోసమే ఈ అత్యవసర సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. డిజైన్ డెవలప్ మెంట్ ఫోరమ్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించామన్నారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించాయని ఆరోపించారు. ఇప్పటికే ఎమ్మెల్యే కూడా దీనిపై చెప్పారన్నారు. తాము రైతుల వెంటే ఉంటామనీ, బీఆర్ఎస్ రైతు ప్రభుత్వమనీ, ఎవరికీ అన్యాయం జరగదని అన్నారు. ప్రతిపక్షాల మాటలు ఎవరూ నమ్మవద్దని సూచించారు. 60 రోజుల పాటు అభ్యంతరాలు తీసుకున్నామనీ, వాటిని కూడా ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండస్ట్రియల్ జోన్ చేయమనీ, రైతులు ఆందోళన విరమించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
సుప్రీం కోర్టులో ఏపి సర్కార్ కు దక్కని ఊరట .. జీవో నెం.1పై విచారణలో సుప్రీం కోర్టు ఏమన్నదంటే..?