Koushik Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హుజురాబాద్ నియోజవకర్గం నేత పాడి కౌశిక్రెడ్డి ఎట్టకేలకు టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కౌశిక్రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చేరిక సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ కౌశిక్రెడ్డి టీఆర్ఎస్లో చేరడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కౌశిక్రెడ్డి టీఆర్ఎస్లోకి వచ్చారని తెలిపారు. అయితే, ఈ సందర్భంగా అసలు విషయం మాత్రం కేసీఆర్ చెప్పలేదని అంటున్నారు.
Read More : Koushik Reddy: కౌశిక్ రెడ్డి చేరిక పెండింగ్లో పడింది ఇందుకేనా?
అసలు విషయం ఇది…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇలాకా అయిన హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కౌశిక్ రెడ్డి ఆ పార్టీలో ఉన్న సమయంలోనే ‘టీఆర్ఎస్ టికెట్ నాకే` అంటూ ఓ నాయకుడితో మాట్లాడిన ఆడియో బయటపడటంతో కలకలం రేగిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో తన అనుచరులతో కలిసి సీఎం కేసీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు.
Read More : Koushik Reddy: కౌశిక్ రెడ్డి అమాయకుడా? తెలివైనోడా?
కేసీఆర్ అప్పుడే ఎన్ని మాటలు అన్నారంటే…
ఈ యువనేత పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కౌశిక్రెడ్డితో పాటు ఆయన అనుచరులను సాదరంగా టీర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నానని తెలిపారు. “కౌశిక్రెడ్డి తండ్రి సాయినాథ్రెడ్డి రాజకీయాల్లో నాతో కలిసి పనిచేశారు. చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంతో ఆయన నాయకత్వంలోని తెలంగాణ ప్రజాసమితి అప్పట్లో 11 ఎంపీ సీట్లు గెలుచుకుంది“ అని గుర్తు చేశారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి పథకం వెనుక ఎంతో మథనం ఉందని కేసీరా్ తెలిపారు. అయితే, ఈ సందర్భంగా కౌశిక్రెడ్డి భరోసా పెట్టుకున్న టికెట్ విషయంలో మాత్రం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇవ్వకపోవడం గమనార్హం.