NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP Janasena Alliance: జనసేనకు సీట్లు ఫిక్స్ ..? నేడు ఫైనలైజ్ చేయనున్న బీజేపీ అధిష్టానం

BJP Janasena Alliance: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ – జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తొంది. పొత్తు అంశంపై ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ముందుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ లు మంతనాలు జరిపారు. ఆ తర్వాత అమిత్ షాతో పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారు. పొత్తుపై పయనంపై అవగాహనకు వచ్చేశారు.

పొత్తులో భాగంగా జనసేన పార్టీ 20 సీట్లు డిమాండ్ చేస్తుండగా, బీజేపీ అధిష్టానం జనసేనకు 9 నుండి 11 సీట్లు ఇవ్వడానికి సిద్దమైనట్లుగా తెలుస్తొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్రప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్ వంటి స్థానాలను తమకు కేటాయించాలని జనసేన కోరుతోంది. అయితే కూకట్ పల్లి ని జనసేనకు కేటాయించేందుకు బీజేపీ నాయకత్వం అంగీకరించినట్లు సమాచారం. అలానే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా ఉన్న ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో మిగితా స్థానాలను కేటాయించే అవకాశం ఉంది.

Pawan Kalyan Amit Shah

బీజేపీ అభ్యర్ధుల తదుపరి జాబితాపై అధిష్టానంతో చర్చించేందుకు నిన్న ఢిల్లీకి చేరుకున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో సమావేశమైయ్యారు. బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్ చార్జి ప్రకాశ్ జవడేకర్, తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తదితరులు ఈ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా తెలిసింది. అదే సమయంలో రాజస్థాన్ మలి విడత జాబితాపై కసరత్తు నిర్వహణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నడ్డా నివాసానికి చేరుకున్నారు.

రాజస్థాన్ లో మరో 76 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉండగా, తెలంగాణలో 119 స్థానాల్లో రెండు విడతలుగా 53 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది బీజేపీ. మిగిలిన 66 స్థానాల్లో జనసేనకు కేటాయించనున్న స్థానాలను మినహాయించి అభ్యర్ధుల ఎంపిక చేసేందుకు తెలంగాణ కోర్ కమిటీ నేతలు నడ్డా నివాసంలో భేటీ అయ్యారు. ఇవేళ సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయంలో జేపీ నడ్డా అధ్యక్షతన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనున్నది.

ఈ భేటీలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తో పాటు కమిటీ సభ్యులు దేవేంద్ర ఫడ్నవీస్, డాక్టర్ కే లక్ష్మణ్ తదితరులు పాల్గొననున్నారు. పోలింగ్ కు మరో 30 రోజులు మాత్రమే సమయం ఉన్నందున అభ్యర్ధుల ఎంపిక ప్రకియ పూర్తి చేసి ప్రచారంపై దృష్టి పూర్తిగా కేంద్రీకరించాలని బీజేపీ నేతలు సన్నద్దం అవుతున్నారు.

AP High Court: రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju