పాక్ అదుపులో ఉన్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం భారత్లో అడుగుపెట్టనున్నారు. అభినందన్ను ఈ రోజు విడుదల చేయనున్నట్టు పాక్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో వాఘా సరిహద్దు వద్ద ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అభినందన్కు స్వాగతం పలకడానికి భారత బలగాలు వాఘా సరిహద్దు వద్ద ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అతన్ని పాక్ భారత్ కు అప్పగించనుంది.
అభినందన్కు స్వాగతం పలకడానికి తనకు అవకాశం ఇవ్వాలంటూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రధాని మోదీని కోరారు. కేంద్రం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవటంతో వాఘా సరిహద్దుకు వెళ్ళటం లేదని అమరీందర్ మీడియాకి తెలిపారు.
చెన్నైలో ఉన్న అభినందన్ తల్లిదండ్రులు తమ కుమారుడిని చూసేందుకు గురువారం రాత్రే ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి వాఘా సరిహద్దుకు చేరుకున్నారు.