ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల మొదటి విడత పోలింగ్కు ప్రచార పర్వం మరో రోజులో ముగియనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సోమవారం పార్టీ మేనిఫెస్టోను విడుదలకు సన్నాహాలు చేస్తోంది. పార్టీ మేనిఫెస్టో విడుదల చేయకముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా సోమవారం పార్టీ సీనియర్ నాయకులు ఎల్కె అద్వానీ, మురళీమనోహర్ జోషిలను కలవనున్నట్లు సమాచారం.
భారతీయ జనతా పార్టీలో కురువృద్ధులైన ఎల్కె అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.
75సంవత్సరాలు పైబడిన నేతలను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న పార్టీ నిర్ణయం మేరకు వీరిద్దరితో పాటు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహజన్లకు టికెట్లను ఖరారు చేయలేదని సమాచారం.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం విదితమే.