అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జివో నెం.63ను హైకోర్టు కొట్టివేసింది. పిపిఏలపై ప్రభుత్వం నియమించిన కమిటితో చర్చలకు రావాలని ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటి వరకూ నిర్ణయించిన ధర ప్రకారం ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భవిష్యత్తులో ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఏపి ఇఆర్సికి వెళ్లాలని ప్రభుత్వానికి, పిపిఏలకు హైకోర్టు సూచించింది. ఆరు నెలల్లోపు వివాదాన్ని పరిష్కరించాలనీ, వివిధ కారణాలతో విద్యుత్ను తీసుకోవడం నిలిపివేసిన సంస్థల నుండి వెంటనే సరఫరా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది.
next post