(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
వారం రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ హ్యూస్టన్ చేరుకున్నారు. ఇవాళ అక్కడ జరిగే ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్లో మోదీ పాల్గొననున్నారు. శనివారం రాత్రి హ్యూస్టన్ లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. అమెరికా అధికారులు, ప్రవాస భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన ఒక అధికారి మోదీకి స్వాగతం పలుకుతూ ఒక బొకేను అందించారు. ఇంతలో దానిలో నుంచి ఒక పూవు కింద పడిపోయింది. దీనిని గమనించిన మోదీ కిందకు వంగి దానిని తీశారు. ఆ పుష్పాన్ని తీసుకుని అక్కడే ఉన్న సైనికాధికారి చేతికి అందించారు.
హ్యూస్టన్లో చమురు కంపెనీల సీఈవోలతో మోదీ సమావేశమయ్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నరకు హోటల్ పోస్ట్ ఓక్లో 16 చమురు కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చమురు, సహజవాయువులకు భారత్ ప్రధానమైన మార్కెట్ అని వివరించిన మోదీ… భారత్లో పెట్టుబడులకు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించారు.
మరోవైపు హ్యూస్టన్ లోని ఎన్ఆర్జీ స్టేడియంలో ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్లో అంగరంగ వైభంగా జరగనుంది. మూడ్రోజుల కిందట భారీ వర్షాలు కురిసినా… ప్రస్తుతం స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎన్ఆర్జీ స్టేడియం పరిసరాల్లో ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. భారత్-అమెరికా స్నేహబంధానికి సూచికగా స్టేడియం వద్ద ఇరుదేశాల జెండాలతో 200 కార్లతో ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు 600 మంది నిర్వాహకులు, 1500మంది వలంటీర్లు అహరహం శ్రమిస్తున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ దేశాల అధినేతలు మోదీ, ట్రంప్లు పాల్గొననున్న ఈ కార్యక్రమంపై ఇరుదేశాల ప్రజలే కాకుండా ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
భారతదేశ కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 9.15 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఏకబిగిన మూడు గంటలపాటు జరుగుతుంది. మోదీ పాల్గొనే ఈ సభ అక్కడ ఓ రికార్డు! ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి 50వేల మంది భారత సంతతి ప్రజలు పాల్గొననున్నారు. అనేక మంది కాంగ్రెస్ సభ్యులు, మేయర్లు, అమెరికన్ ప్రముఖులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా 90 నిమిషాల పాటూ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. వీటిలో 400 మంది కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ ప్రధానమంత్రులతో ట్రంప్ వేర్వేరుగా భేటీ కానున్నారు. ఆదివారం ‘హౌడీ మోదీ’ కార్యక్రమం తర్వాత మంగళవారం ట్రంప్-మోదీ సమావేశం ఉంటుంది. సోమవారం ఇమ్రాన్ ఖాన్తో ట్రంప్ సమావేశం అవుతారు.
మొత్తం వారం రోజుల పర్యటనలో.. ఈ నెల 24వ తేదీన ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఇచ్చే విందుకు మోదీ హాజరవుతారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని… 150 మొక్కలు నాటే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలు, భారత ప్రతినిధి బృందంతో మోదీ భేటీ అవుతారు. ఆ తర్వాత 27న తిరిగి భారత్ వస్తారు.
I had a special interaction with Kashmiri Pandits in Houston. pic.twitter.com/07coxdg0oS
— Narendra Modi (@narendramodi) September 22, 2019
The Dawoodi Bohra community has distinguished itself across the world. In Houston, I had the opportunity to spend time with them and speak about a wide range of issues. pic.twitter.com/zxHXa9Ka9Z
— Narendra Modi (@narendramodi) September 22, 2019