బిగ్ బాస్ నాలుగో సీజన్ కు తెరవెనుక కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే ఎవరు ఎవరు పాల్గొనాలి, గెస్టు లు గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు రావాలి అనే దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. బిత్తిరి సత్తి, టీవీ 5 మూర్తి, అలాగే కొంత మంది హీరోయిన్లు, అల్లరి నరేష్, తరుణ్ వంటి హీరోలు, సింగర్ సునీత వీరందరినీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు అందరూ ఖరారు అయినట్లే. హోస్ట్ గా నాగార్జున లేదా సమంత అనుకుంటున్నారు. ఇది అంతా బానే ఉంది. బిగ్ బాస్ ఏర్పాట్లు తెర వెనుక చకచకా సాగిపోతున్నాయి. హౌస్ నిర్మాణం కూడా జరుగుతున్నది.
అయితే బిగ్ బాస్ గతం లో మాదిరిగా 100 రోజులు కాకుండా కూడా 50 రోజు లలో ముగించాలని చూస్తున్నారట. దీనికి కారణం కరోనా భయమే. కరోనా గతంలో కంటే ఇప్పుడు పెరిగింది.కేవలం హైదరాబాద్ నగరంలోనే రోజుకు వెయ్యి కేసులు, తెలంగాణ అంతటా రోజు రెండు వేల కేసులు బయటపడుతున్నాయి. అతి తక్కువ టెస్ట్ లు చేస్తుంటేనే ఇన్ని కేసులు బయటపడుతున్నాయి. టెస్ట్ లు పెరిగే కొద్దీ హైదరాబాద్ లో, తెలంగాణలో నూ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. అలాగే టీవీ సీరియల్ నటీ నటుల్లో అనేక మందికి కరోనా కూడా ఉంది. ఈ మధ్యనే సీరియల్ యాక్టర్ లు ప్రభాకర్, హరికృష్ణ, ఒక డైరెక్టర్ కి, మరో ఎనిమిది మంది టీ వీ సీరియస్ నటులకు కరోనా ఉన్నట్లు తేలింది. కరోనా భయం వెంటాడుతున్న సమయంలో బిగ్ బాస్ షూటింగ్ అంటే హౌస్ నిర్మాణం, తెరవెనుక పనులు, కంటెస్టెంట్ ల చుట్టూ పనులు చేసే ఎంతో మంది సహాయకులు దాదాపు 200 మంది అవసరం ఉంది. కంటెస్టెంట్ లు 50 మంది ఉన్నా 10 మంది ఉన్నా ఐదుగురు ఉన్నా సరే తెరవెనుక పని చేయాల్సిన వారు 200 మంది కంటే ఎక్కువ ఉంటారు. ఈ కరోనా సమయంలో వంద రోజుల పాటు మెయింటైన్ చేస్తూ నిర్వహించే ఓపిక లేక అన్ని ఇబ్బందులు ఎందుకని 50 రోజులకు కుదించారు. కానీ 50 రోజులు నిర్వహించడం కూడా ఒక సవాలే, రిస్క్ చేస్తున్నట్లే. ఈ రిస్క్ లు భరించడానికి మా టివి యాజమాన్యం సిద్ధంగా లేదట. అందుకే కొన్నాళ్ల పాటు ఈ షోను వాయిదా వేయాలని చూస్తున్నారని మరో వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ షో నిర్వహణకు తెరవెనుక పనులు చేయాల్సిన వారందరూ ముంబై నుంచి రావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రావడం, కరోనా టెస్ట్ లు చేయించుకోవడం, క్వారంటైను కు వెళ్ళడం అలాగే బిగ్ బాస్ హౌస్ లో కంటేస్తెంట్ లు అందరికీ రోజుకు రెండు సార్లు కరోనా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వాళ్లతో పాటు నిర్వాహకులు, సహాయకు లకూ పరీక్షలు చేయాలి. ఈ 50 రోజుల్లో లేదా వంద రోజుల్లో ఏ ఒక్కరికి కరోనా సోకినట్లు తేలినా షో మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అలానే కంటేస్తేంట్ లలో ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్ వచ్చినా షో అక్కడితో అపే అవకాశం ఉంది. ఇన్ని సవాళ్లు ఉన్నప్పుడు రిస్క్ తీసుకుని షో చేయాలా వద్దా అన్న మీమాంసలో మా టివి యాజమాన్యం ఉందట. నిజమే కదా.. మీరు ఏమంటారు?