న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ ను ఎట్టకేలకు పోలీసులు విచారించారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారులు ఆయనను గురువారం రాత్రి దాదాపు ఏడు గంటల పాటు చిన్మయానంద్ ను విచారించారు. చిన్మయానంద్ స్వామి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఉత్తరప్రదేశ్ కు చెందిన 23 ఏళ్ల న్యాయ విద్యార్థిని..ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సిట్ అధికారులు చిన్మయానంద్ ను విచారించారు. గురువారం సాయంత్రం 6.20 నిమిషాలకు ప్రారంభమైన విచారణ.. అర్ధరాత్రి ఒంటి గంట వరకు కొనసాగింది. ప్రధానంగా లైంగిక ఆరోపణలు, బ్లాక్ మెయిల్ కి సంబంధించిన అంశాలనే అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తామని, చిన్మయాంద్ ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని ఆయన తరుపు లాయర్ అన్నారు.
ఇటీవలే తన ఆరోపణలకు సంబంధించిన వీడియో సాక్ష్యాన్ని కూడా బాధిత విద్యార్థిని బయటపెట్టంది. ఓ పెన్ డ్రైవ్ను పోలీసులకు అందజేసింది. 73 ఏళ్ల చిన్మయానంద్ బట్టలు లేకుండా తనతో మసాజ్ చేయించుకోవడాన్ని కళ్లద్దాలలో అమర్చిన రహస్య కెమెరాలతో బాధితురాలు చిత్రీకరించడం తెలిసిందే. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కూడా అయ్యాయి.
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి హయంలో చిన్మయానంద్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం యూపీలో పలు ఆశ్రమాలు, విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. అయితే చిన్మయాంద్ కు చెందిన ఓ కళాశాలలో చదువుతున్న న్యాయ విద్యార్థిని ఇటీవలే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. బ్లాక్ మెయిల్ చేసి చిన్మయానంద్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఆగస్ట్ 24న ఫేస్ బుక్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తర్వాత వారం రోజుల పాటు కనిపించకుండా పోయింది. దీంతో ఆమెను చిన్మయానందే కిడ్నాప్ చేయించారని ప్రచారం జరిగింది. అయితే వారం రోజుల తరువాత యూపీ పోలీసులు ఆమెను రాజస్థాన్లో గుర్తించారు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాధితురాలిని న్యాయస్థానంలో హాజరుపర్చారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కేసుకి సంబంధించిన సిట్ ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కోర్టు నియమించిన సిట్.. గత ఆదివారం బాధిత విద్యార్థినిని దాదాపు 15 గంటలపాటు విచారించింది. ఆమె నుంచి అనేక వివరాలు తీసుకుంది. తాజాగా చిన్మయానంద్ ను కూడా ప్రశ్నించింది.
https://twitter.com/ANINewsUP/status/1172387425919725568