కేంద్ర ప్రభుత్వం బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్కు ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖామాత్యులు ప్రకాశ్ జవదేకర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. “ఎన్నో సంవత్సరాలుగా సినీ ప్రేమికులకు వినోదాన్ని పంచుతున్న ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఏకగ్రీవంగా ఎన్నిక చేశాం. ఇందుకు యావత్ దేశమే కాదు అంతర్జాతీయ సమాజం కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తోంది, ఆయనకు మా అభినందనలు“ అని మెసేజ్ను పోస్ట్ చేశారు జవదేకర్.అమితాబ్కు ఫాల్కే అవార్డు రావడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
`సౌత్ హిందుస్థానీ` సినిమాతో నటుడిగా కెరీర్ను ప్రారంభించిన అమితాబ్ నటుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ సూపర్స్టార్ రేంజ్ను చేరుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. డాన్, జంజీర్, షోలో, దీవార్ వంటి కమర్షియల్ సినిమాలే కాదు.. బ్లాక్, పా, పీకూ వంటి ఎన్నో డిఫరెంట్ మూవీస్లోనూ ఆయన అలరించారు.
సినీ రంగానికి అపురూపమైన సేవలు చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం 1969 నుండి ఈ అవార్డులను ఇస్తూ వస్తుంది. అమితాబ్ ఈ అవార్డు అందుకుంటున్న 50వ వ్యక్తి. ఈ అవార్డు విజేతలను రాష్ట్రపతి స్వర్ణ కమలం, రూ.10లక్షల నగదుతో ప్రభుత్వం సత్కరిస్తుంది.
previous post
next post