బెంగళూరు: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్డిఒ)కు చెందిన ఒక డ్రోన్ మంగళవారం కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా జోడిచిల్లెనహళ్లి గ్రామ సమీప పంట పొలాల్లో కుప్పకూలింది.
చల్లకెరె ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ పేరుతో చిత్రదుర్గ సమీపంలో మానవరహిత, మానవసహిత ఎయిర్ క్రాఫ్ట్ ప్రయోగాల కోసం డిఆర్డిఒ ఒ ప్రత్యేక టెస్ట్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నది. మంగళవారం ఉదయం ఈ టెస్ట్ రేంజ్ నుండి రుస్తుమ్ -2 డ్రోన్ టెస్ట్ ట్రయిల్ నిర్వహించగా అది విఫలం అయ్యింది. ఆ డ్రోన్ పంట పొలాల్లో కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు.
ఒక్క సారిగా పెద్ద శబ్దంతో డ్రోన్ కూలిపోవడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొందరు సెల్ ఫోన్ ద్వారా ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. డ్రోన్ కూలిన ప్రాంతానికి డిఆర్డిఒ అధికారులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Unmanned aerial vehicle crashes in farmland near DRDO facility in Chitradurga, Karnataka. Officials have rushed to the spot. pic.twitter.com/eeJ72qouyn
— Prajwal (@prajwalmanipal) September 17, 2019