న్యూఢిల్లీ: దేశంలో ఈ-సిగరెట్ల వాడకాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘దేశంలో ఈ-సిగరెట్లపై నిషేధం విధించాలన్న నిర్ణయానికి ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిప్రకారం ఈ-సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, దిగుమతి-ఎగుమతి, రవాణా, అమ్మకం, నిల్వ చేయడం, ప్రకటనలు ఇవ్వడాన్ని నిషేధిస్తున్నాం’ అని సీతారామన్ చెప్పారు. ఇండియాలో ముఖ్యంగా యువత వీటికి అడిక్ట్ కావడం ఆందోళన కలిగిస్తోందని ఆమె చెప్పారు.
#UnionCabinet has today approved the Promulgation of the Prohibition of Electronic Cigarettes (production, manufacture, import, export, transport, sale, distribution, storage and advertisement) Ordinance, 2019.#cabinetdecisions pic.twitter.com/rQg1NUMzbL
— PIB India (@PIB_India) September 18, 2019
నియమావళిని ఉల్లంఘించిన వారి పట్ల కూడా కఠిన చర్యలు కూడా తీసుకోనున్నారు. ఈ-సిగరెట్లు కలిగి ఉన్నవారికి ఏడాది జైలు శిక్షను అమలు చేయనున్నారు. వారికి అదనంగా లక్ష జరిమానా కూడా విధించనున్నారు. ఎలక్ట్రానిక్ నికోటిన్ను అదుపు చేయాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, యూటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అమెరికాకు చెందిన వాపింగ్ డివైస్లను కూడా అమ్మకుండా నిషేధం విధించారు.
Union Minister Nirmala Sitharaman: Reports say that there are some who are probably getting into the habit of e-cigarettes as it seems cool. It is believed that there are more than 400 brands, none of which is manufactured yet in India. And they come in over 150 flavours. https://t.co/1eoC7s2gbo
— ANI (@ANI) September 18, 2019
ఈ-సిగరెట్ల నిషేధానికి సంబంధించిన ఆర్డినెన్సు ప్రకారం.. వీటిని స్టోరేజీ చేసిన పక్షంలో ఆరు నెలల పాటు జైలుశిక్ష, లేదా 50 వేల జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. అలాగే వీటి ఉత్పత్తి, తయారీ, పంపిణీ, అమ్మకాలువంటివి చేస్తే మొదట ఏడాది పాటు జైలుశిక్ష, లేదా లక్ష రూపాయల ఫైన్, లేదా రెండూ విధిస్తారు. రెండో సారి పట్టుబడితే మూడేళ్ళ వరకు జైలు, 5 లక్షల జరిమానా విధిస్తారు.
పొగతాగడాన్ని విడిచిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ-సిగరెట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ- సిగరెట్లలో పొగాకు వాడకపోయినా ద్రవ రసాయనాలను మండించి వేపర్గా మలుస్తారు. వీటిని ఈ-సిగరెట్ల ద్వారా పీల్చడంతో ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ సిగరెట్ల తయారీ, దిగుమతి, రవాణా, సరఫరా, వీటికి సంబంధించి ప్రకటనలు ఇవ్వడం నేరంగా పరిగణిస్తూ సిద్ధం చేసిన ప్రతిపాదనలు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.