ముంబయి: ముంబయిలోని ఓ ఆసుపత్రిలో ఒక యువకుడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అవాక్కయ్యారు.
వివాహం అయి రెండేళ్లు అయినా తనకు సంతానం కలగడం లేదని ఓ యువకుడు ముంబయిలోని జెజె ఆసుపత్రికి వెళ్లాడు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ గీతే అతని శరరంలో గర్భసంచి అందని తెలియడంతో ఖంగుతిన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైద్య చరిత్రలో ఇటువంటి ఘటనలు అరుదుగా కనిపిస్తుంటాయి.
అతని జీర్ణాశయానికి అండాశయాలు అతుక్కొని ఉన్నట్లు పరీక్షల ద్వారా వైద్యులు గుర్తించారు. దీంతో అతను పురుషుడా లేక మహిళా అనే విషయాన్ని తేల్చేందుకు పరీక్షలు నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షల అనంతరం అతను పురుషుడేనని తేల్చారు. తరువాత శస్త్రచికిత్స ద్వారా గర్భసంచిని తొలగించారు.
తమ ఆసుపత్రికి ఇలాంటి కేసు రావడం ఇదే ప్రధమమని జేజే ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా 200మంది పురుషుల్లో గర్భసంచి ఉన్న ఘటనలు ఇప్పటి వరకూ వెలుగుచూశాయి.