ఢిల్లీ: రాజకీయ నేతగా మారిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తూర్పు ఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలో గంభీర్ ఈ నెల 25న ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీ నిర్వహించారు. ఈ విషయంపై రిటర్నింగ్ అధికారి కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి నివేదిక పంపారు.
ఎన్నికల సంఘం ఆదేశాలతో రిటర్నింగ్ అధికారి గంభీర్పై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది.
గంభీర్ తూర్పు ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
గంభీర్కు రెండు ఓటర్ ఐడీలు ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆయనకు రాజేంద్రనగర్, కరోల్ బాగ్లో ఓటు హక్కు ఉందని ఆరోపించింది.