NewsOrbit
టాప్ స్టోరీస్

సమాచార కమిషన్ పై సర్కారు పెత్తనం?

కమిషనర్ల మీద ఫిర్యాదులపై విచారణాధికారం
అధికారం కావాలని కోరుతున్న కేంద్రప్రభుత్వం
కుదరదని చెబుతున్న సమాచారహక్కు చట్టం

న్యూఢిల్లీ: ఎన్నికల ముంగిట కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వ్యవస్థల ధ్వంసం ఇంకా కొనసాగుతూనే ఉంది. సమాచార హక్కు చట్టం కింద ఏర్పాటైన కేంద్ర సమాచార కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. కానీ దానిమీద కూడా పెత్తనం చలాయించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్ర సమాచార కమిషనర్ సహా సమాచార కమిషనర్లపై వచ్చే ఫిర్యాదుల విచారణకు ఉన్నతాధికారులతో ఓ కమిటీ వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తన కథనంలో ప్రచురించింది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలపాలని సీఐసీకి గత నెలలో లేఖ రాసింది. సిబ్బంది వ్యవహారాల శాఖ అండర్ సెక్రటరీ దీనిపై సంతకం చేశారు.

సీఐసీపై ఫిర్యాదులు అందుకుని, విచారించడానికి ఒకటి.. సమాచార కమిషనర్లపై ఫిర్యాదులకు మరొకటి రెండు కమిటీలు వేయాలన్నది ప్రభుత్వ యోచన. మొదటి కమిటీలో కేబినెట్ కార్యదర్శి, డీఓపీటీ కార్యదర్శి, రిటైరైన సీఐసీ ఉంటారు. రెండో కమిటీలో కేబినెట్ సెక్రటేరియట్ లోని సమన్వయ కార్యదర్శి, డీఓపీటీ కార్యదర్శి, రిటైరైన సీఐసీ ఉంటారు. రెండింటిలో ప్రభుత్వాధికారులదే పైచేయి అవుతుంది. సమాచార కమిషనర్ల పనిపై రాజకీయ ప్రభావం చూపడానికే ఈ ప్రతిపాదన చేశారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. దీనివల్ల పారదర్శకతకు పెద్దపీట వేసే వ్యవస్థకు స్వతంత్రం పోతుందని అన్నారు. కమిషన్ పై ప్రభుత్వ ఒత్తిడి పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సమాచార కమిషనర్లపై ఫిర్యాదు చేసేందుకు ఎలాంటి అవకాశం లేదు. ఎవరైనా కమిషనర్లపై ఫిర్యాదు వస్తే ప్రధాన కమిషనర్ చూస్తారు, ఆయనపైనే వస్తే ఉన్న కమిషనర్లందరూ చూస్తారు. డీఓపీటీ ప్రతిపాదనలపై ప్రధాన కమిషనర్, ఐదుగురు కమిషనర్లు మార్చి నెలాఖరులో చర్చించినట్లు సమాచారం. దాన్ని అందరూ వ్యతిరేకించారు. ప్రతిపాదనకు సంబంధించిన న్యాయ, సాంకేతిక, పాలనాపరమైన అంశాలన్నీ పరిశీలించి అప్పుడు వివరంగా నోట్ పంపాలని భావిస్తున్నట్లు పేరు వెల్లడించని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

కేంద్ర సమాచార కమిషనర్లు, ప్రధాన కమిషనర్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా ఉంటుంది. వారందరినీ రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధాని, ప్రతిపక్ష నేత, కేంద్ర మంత్రితో కూడిన కమిటీ ప్రతిపాదనలు ఇస్తుంది. కమిషనర్లు ఎవరైనా దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు తేలితే సుప్రీంకోర్టు సలహా మేరకు రాష్ట్రపతి మాత్రమే వారిని తొలగించగలరు. ఈ విషయం ఆర్టీఐ చట్టం సెక్షన్ 14(1)లో ఉంది. ఎవరైనా కమిషనర్ దివాలా తీసినా, వేరే ఉద్యోగం చేసినా, శారీరక.. మానసిక అనారోగ్యం కారణంగా ఉద్యోగం చేయడానికి తగినంత సామర్ధ్యం లేకపోయినా రాష్ట్రపతి వారిని తొలగించవచ్చు. ఈ విషయం ఆర్టీఐ చట్టం సెక్షన్ 14(3)లో ఉంది.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment