వరుసగా పేజీలు తీసేస్తున్న ఫేస్ బుక్
ఇప్పటికే 700 కాంగ్రెస్ పేజీల తొలగింపు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ప్రక్షాళన మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న దాదాపు 700 పేజీలను ఇప్పటికే తొలగించింది. కాంగ్రెస్ ఐటీ సెల్ కు అనుబంధంగా ఉన్న వ్యక్తుల పేరుతో ఈ అకౌంట్లున్నాయి. అయితే, త్వరలోనే బీజేపీ మీద కూడా ఈ దెబ్బ పడే అవకాశం ఉంది. బీజేపీకి అనుబంధంగా 15 పేజీలు, గ్రూపులు ఉన్నాయని ఫేస్ బుక్ ప్రకటించింది. కాంగ్రెస్ పేజీల సంఖ్య ఎక్కువే అయినా, వాటన్నింటికీ కలిపి ఉన్నది 2 లక్షల మంది ఫాలోవర్లే. కానీ బీజేపీ అనుబంధంగా ఉన్న ఒక పేజీ, 12 అకౌంట్లు, ఒక గ్రూపు, ఒక ఇన్ స్టాగ్రామ్ అకౌంటుకు కలిపి 26 లక్షల మంది ఫాలోవర్లున్నారు.
This is to clarify no official pages run by INC have been taken down. Additionally, all pages run by our verified volunteers are also unaffected.
In the mean time, we are awaiting a response from Facebook to provide us a list of all pages/accounts that they have taken down.
— Congress (@INCIndia) April 1, 2019
2014 ఆగస్టు నుంచి కాంగ్రెస్ అనుకూల పేజీలలో వచ్చిన ప్రకటనల మీద దాదాపు రూ. 27 లక్షలు ఖర్చుపెడితే, బీజేపీ అనుకూల పేజీల మీద రూ. 50 లక్షల వరకు పెట్టారు. సిల్వర్ టచ్ అనే ఐటీ సంస్థకు అనుబంధంగా ఉనన వ్యక్తులు ఈ ప్రకటనలు ఇచ్చినట్లుగా తెలిసిందని ఫేస్ బుక్ తెలిపింది. స్థానిక వార్తలు, రాజకీయ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి అధికారిక, ఫేక్ ఖాతాలు రెండింటినీ వాడుతున్నారు. ప్రత్యర్థుల కుట్రల గురించి కూడా ఈ పేజీలలో ఉన్నట్లు తెలిసింది. అయితే, సిల్వర్ టచ్ సంస్థతో తమకు సంబంధం లేదని బీజేపీ ఐటీసెల్ చీఫ్ అమిత్ మాలవీయ గతంలో ఒకసారి ఎన్డీటీవీకి చెప్పారు. కానీ ఆ సంస్థ గుజరాత్ ప్రభుత్వానికి చెందిన 17 శాఖలకు సేవలు అందిస్తోంది, 46 ప్రభుత్వ వెబ్ సైట్లను నిర్వహిస్తోంది. రాష్ట్రపతికి, విదేశాంగ మంత్రిత్వశాఖకు యాప్ లు కూడా రూపొందించింది.