(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏటా ఈ సీజన్లో జరిగే అమరనాథ్ సందర్శన చాలా కష్టతరమైన యాత్ర. హిమాలయ సానువుల్లోని మంచు లింగాన్ని దర్శించేందుకు వెళ్లే భక్తులు చాలా వ్యయప్రయాసలకు ఓర్చాల్సిఉంటుంది. ఈ సంవత్సరం యాత్రకు వెళ్లిన భక్తులకు ఇండో టిబెటన్ సరిహద్దు దళం (ఐటిబిపి) జవానులు కాపు కాశారు. ఒక చోట దారి కాస్త ప్రమాదకరంగా కనబడినప్పుడు యాత్రికులు దానిని దాటే వరకూ తామే అడ్డు గోడగా నిలబడ్డారు.
https://www.instagram.com/p/BzrqXH7F2M_/?utm_source=ig_web_copy_link
ఐటిబిపి జవానులు చేసిన ఈ సాయం పట్ల యాత్రికులు నినాదాలతో కృతజ్ఞతలు చెప్పారు. కశ్మీర్ లోయలోని రెండవ బేస్ క్యాంప్ నుంచి అమరనాథ్ వెళ్లే దారిలో కాళీమాత పాయింట్ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకున్నది. పైనుంచి వేగంగా వచ్చిపడుతున్న నీటినూ, రాళ్లనూ లెక్క చేయకుండా ఐటిబిపి జవానులు యాత్రికులు అందరూ దాటి వెళ్లేంతవరకూ రక్షణకవచంలా నిలబడ్డారు. ఈ వీడియో స్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతోంది.