బెంగళూర్: రాష్ట్రంలోని దొద్దబల్లపుర పట్టణంలో బంగ్లాదేశ్కు చెందిన అనుమానిత ఉగ్రవాదిని ఎన్ఐఎ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో కర్నాటక అంతా హైఅలర్ట్ హెచ్చరికలను జారీ చేశారు.
హోంమంత్రి ఎంబి పాటిల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఎన్ఐఎ అధికారులు అరెస్టు చేసిన నిందితుడికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
ఈ నేపథ్యంలో తాను సిఐడి అధికారులతో సమావేశం నిర్వహించామనీ, ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలో హైఅలర్ట్ హెచ్చరికలు జారీ చేసినట్లు పాటిల్ తెలిపారు. రామనగర్ పట్టణంలో బుధవారం ఉగ్రవాది విసిరినట్లుగా భావిస్తున్న రెండు లైవ్ బాంబుల రికవరీపై ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. ఇది ఎన్ఐఎ పరిధిలోకి వస్తుంది, నేను దీని గురించి ఏమీ చెప్పలేను’ అని పాటిల్ సమాధానమిచ్చారు.